
జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లతో పాటు లష్కరే తోయిబాను అమెరికా, ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కూడా వారికి సహాయం చేసే పరిస్థితుల్లో లేకపోవడంతో, ఉగ్రవాద సంస్థలు దూరంగా వెళ్తున్నాయని సమాచారం. ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి కేవలం 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయర్ దిర్ జిల్లాలో లష్కరే తోయిబా మర్కజ్ జిహాద్-ఎ-అక్సా అనే కొత్త స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు, వీడియోల ద్వారా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన రెండు నెలల తర్వాత ఈ నిర్మాణం ప్రారంభమైందని చెబుతున్నారు.
గతంలో, భింబర్-బర్నాలాలోని లష్కరే స్థావరం మర్కజ్ అహ్లే హదీస్ను భారత సైన్యం మే 7న ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తమ స్థావరాలపై తీవ్ర ప్రభావం చూపిందని లష్కరే తోయిబా కమాండర్లు అంగీకరించారు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఖాసిమ్ ఈ దాడి గురించి స్పందిస్తూ, మురిద్కేలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం భారత్ చేసిన దాడుల్లో ధ్వంసమైందని అంగీకరించాడు.
ఈ కార్యాలయాన్ని మళ్లీ భారీగా నిర్మిస్తామని వ్యాఖ్యానించాడు. ఆ ధ్వంసమైన కార్యాలయంలో చాలామంది ముజాహిద్దీన్లు శిక్షణ తీసుకున్నారని తెలిపాడు. లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో మాట్లాడుతూ, ఉగ్ర స్థావరాలను పునర్నిర్మించేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం నిధులు ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్లో మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమైనట్లు ఆయన తెలిపారు.
More Stories
సరిహద్దుల్లో రక్షణకై రూ 30 వేల కోట్లతో మిస్సైల్ వ్యవస్థ
పూర్తి నిషేధంతో మాఫియా చేతుల్లోకి బాణాసంచా పరిశ్రమ
మదర్సా మరుగుదొడ్లలో 40 మంది బాలికల నిర్బంధం