
* నేపాల్ లో భారతీయులకు కీలక అడ్వైజరీ
నేపాల్లోని భారతీయుల సహాయార్థం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసింది. భారతీయ పౌరులు ఏదైనా అత్యవసర పరిస్థితిలో లేదా సాయం అవసరమైతే వెంటనే 977-980 860 2881, 977-981 032 6134 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
మరోవైపు యువత ఆందోళనతో భారత్ నేపాల్లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అక్కడ భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
“నిన్నటి నుంచి నేపాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. రాజధాని కాఠ్మాండు సహా అనేక నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. నేపాల్లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి” అని ప్రకటనలో తెలిపింది.
More Stories
ఆధార్ ను ఐడీ ప్రూఫ్ గా ఆమోదించాల్సిందే
జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
మహారాష్ట్ర సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు