సముద్రంలో ఇటీవల జరిగిన ఢీకొన్న ఘటనపై భారత్ చేసిన నిరసనకు పాకిస్థాన్ ఇచ్చిన సమాధానాన్ని భారత్ గురువారం గట్టిగా తిరస్కరించింది. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కతాకు సంబంధించిన ఈ ఘటనకు దారితీసిన సంఘటనలో, పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పిఎన్ఎస్ హునైన్ “ఆమోదయోగ్యం కాని, వృత్తివిరుద్ధమైన రీతిలో” ప్రవర్తించిందని భారత్ ఆరోపించింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “మేము చేసిన నిరసనకు పాకిస్థాన్ ఇచ్చిన సమాధానాన్ని చూశాము. ఇది మేము ఊహించిన పాత కాలయాపనే. అందులో చేసిన ఆరోపణలను, పరోక్ష సూచనలను మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. పశ్చిమ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ కోల్కతా సాధారణ విధుల్లో ఉన్నప్పుడు, పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పిఎన్ఎస్ హునైన్ సముద్రంలో ఆమోదయోగ్యం కాని, వృత్తివిరుద్ధమైన రీతిలో ప్రవర్తించడం వల్లే ఈ ఢీకొనడం జరిగింది” అని స్పష్టం చేశారు.
జైస్వాల్ ఇంకా మాట్లాడుతూ, “పిఎన్ఎస్ హునైన్ చేసిన ప్రమాదకరమైన ఓవర్టేకింగ్ విన్యాసం, ఏప్రిల్ 1991 నాటి సైనిక విన్యాసాలు, కసరత్తులు. మరియు దళాల కదలికలపై ముందస్తు నోటీసుకు సంబంధించిన భారత్-పాకిస్థాన్ ఒప్పందంలోని ఆర్టికల్ 10ను తీవ్రంగా ఉల్లంఘించడమే” అని మండిపడ్డారు.
సముద్రంలో ఉన్న నావికా దళాలు కనీసం మూడు నాటికల్ మైళ్ల దూరాన్ని పాటించాలని ఈ నిబంధన నిర్దేశిస్తుంది.
పశ్చిమ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ కోల్కతా నౌక సాధారణంగా గస్తీ నిర్వహిస్తుండగా పాకిస్తాన్కు చెందిన నేవీ నౌక హునైన్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో పాక్ నౌక వ్యవహరించిన తీరు అనైతికంగా ఉంది. ఇది భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 10ని ఉల్లంఘించడమే. ఏప్రిల్, 1991లో కుదిరిన ఒప్పందంను అనుసరించి,పీఎన్ఎస్ హునైన్ నౌక ప్రమాదకరంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు.అలాగే, అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రమాదాలు జరగకుండా ఉన్న చట్టాల్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించిందని రణధీర్ జైశ్వాల్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ ఆర్మీ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. భారత నౌకను ఢీకొన్న ఘటనలో పాకిస్తాన్ నౌక ఎక్కువగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, భారత నౌకకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన తర్వాత భారత నౌక సముద్ర జలాల్లో ఎప్పట్లాగే ప్రయాణించింది.
More Stories
పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 21 మంది మృతి
‘మిస్టర్ సింగ్’ పోస్ట్ తర్వాత సిక్కు ట్రక్ డ్రైవర్పై 17కత్తిపోట్లు
చదువులు పూర్తయ్యాక ఇక అమెరికాలో పనిచేయడం భారమే!