ప్రపంచం జి-7ను దాటి ముందుకు సాగింది.. పుతిన్

ప్రపంచం జి-7ను దాటి ముందుకు సాగింది.. పుతిన్
ప్రపంచం లోతైన నిర్మాణాత్మక మార్పులకు లోనవుతోందని, జి-7 స్థాయిని దాటి ముందుకు సాగిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పేర్కొన్నారు. ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న బ్రిక్స్  దేశాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ మాట్లాడుతూ. గత ఐదేళ్లలో ప్రపంచ మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తిలో 40 శాతానికి పైగా బ్రిక్స్ దేశాలే సమకూర్చాయని తెలిపారు.
 
ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఈ దేశాల్లోనే ఉన్నారని, దీనివల్ల వారికి ఇప్పుడు “అత్యంత చైతన్యవంతమైన, శక్తివంతమైన దేశీయ మార్కెట్లు” అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 
“బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను, పరిచయాలను బలోపేతం చేయడం పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఈ సమావేశం తెలియజేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలకు నమ్మదగిన వ్యాపార-వ్యాపార (బి2బి) బంధాలు, ఆర్థిక భాగస్వామ్యాలే వెన్నెముక అని స్పష్టమవుతోంది. ఇది సంబంధాలను మరింత దృఢంగా, సుస్థిరంగా నిర్మించడంలోనూ, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడంలోనూ సహాయపడుతుంది,” అని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
“నేను ‘పాతవి’ అని అనడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే – మనం దేని గురించి మాట్లాడుతున్నామో మనందరికీ తెలుసు. ఆ పాత అగ్రదేశాల వద్ద ఇప్పటికీ బలమైన అంశాలు, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక, శాస్త్రీయ ప్రయోజనాలు, శాస్త్రీయ విజ్ఞాన కేంద్రాలు వంటివి ఉన్నాయి. అయితే, పరిస్థితులు ఇలా ఉండటం విచారకరం; ఇది సహజమైన విషయం కాదు. మానవ స్వభావం లేదా ఆర్థిక వ్యవస్థ స్వభావం ఇలా ఉండదు,” అని ఆయన జోడించారు. 
 
ఇరాన్‌పై అమెరికా యుద్ధం నేపథ్యంలో తలెత్తిన ‘హోర్ముజ్ జలసంధి’ సంక్షోభాన్ని ఆయన నేరుగా ప్రస్తావించనప్పటికీ, పరోక్షంగా దాని గురించే మాట్లాడారు. రష్యాపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాల వైఖరిని కూడా పుతిన్ ఎండగడుతూ అయినప్పటికీ, గత మూడేళ్లుగా రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు కంటే మెరుగైన పనితీరును కనబరిచిందని ఆయన చెప్పారు. రష్యాపై 30,000కు పైగా ఆంక్షలు విధించారని, ప్రపంచంలోని ఇతర దేశాలన్నింటిపై విధించిన మొత్తం ఆంక్షల సంఖ్యతో పోలిస్తే ఇది రెట్టింపు అని ఆయన పేర్కొన్నారు.
 
 “ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రష్యా చురుకుగా పనిచేస్తూ గొప్ప విజయాలను సాధించింది. మేము మా జాతీయ సార్వభౌమాధికారాన్ని బలోపేతం చేసుకున్నాము. నమ్మదగిన, స్థిరమైన భాగస్వాములతో సంబంధాలను పెంపొందించుకుంటున్నాము,” అని ఆయన చెప్పారు.