ఢిల్లీలో ఆదివారం కూలిన పీజీ హాస్టల్ భవనం ఘటనలో సత్యా నికేతన్ భవనం యజమానై హరిరామ్ గుప్తాను రాజస్థాన్లోని భివాడిలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ ఘటనలో మృతుల సంఖ్య ఎందుకు పెరిగింది. భవనం కండీషన్తో పాటు రిపేర్ వర్క్ జరిగిన తీరును కూడా విచారిస్తున్నారు. మరోవంక, ఘటనలో ఢిల్లీ మున్సిపల్ శాఖ అయిదుగురు అధికారులపై సస్పెన్షన్ విధించింది.
దక్షిణ జోన్ డిప్యూటీ కమీషనర్ రాకేశ్ కుమార్తో పాటు నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సూపరెంటెండింగ్ ఇంజినీర్ రన్వీర్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(బిల్డింగ్) లలిత్ కుమార్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్(బిల్డింగ్) సునీల్ చౌహాన్, జూనియర్ ఇంజినీర్(బిల్డింగ్ ఆశిశ్ కుమార్ వేటు పడినవారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సమీపంలోని విద్యార్థులు అధికంగా ఉండే ప్రాంతంలో జరిగిన విపత్తు తీవ్రతను ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రత్యేకంగా ప్రస్తావించిన అనంతరం, సోమవారం ఈ విషయాన్ని విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది.
పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతులు, నర్సింగ్ హోమ్లు, పాఠశాలలతో సహా ప్రజా కార్యకలాపాల కోసం ఉపయోగించే అన్ని భవనాలకు కాలానుగుణంగా నిర్మాణ తనిఖీలు, భద్రతా ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేస్తూ ఒక కీలకమైన విధాన మార్పును ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ సీఎం రేఖా గుప్తా ఇలా పేర్కొన్నారు: “ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి ఒక విధానాన్ని రూపొందిస్తోంది. దీని ప్రకారం, ప్రజా వినియోగం కోసం ఉద్దేశించిన ఏ భవనమైనా, అది పీజీ అయినా, నర్సింగ్ హోమ్ అయినా, పాఠశాల అయినా, లేదా మరే ఇతర సదుపాయం అయినా, తప్పనిసరిగా కాలానుగుణంగా నిర్మాణ తనిఖీలు, భద్రతా ధృవీకరణ పత్రాలను పొందాలి; లేని పక్షంలో, అక్కడ ఎలాంటి ప్రజా కార్యకలాపాలకు అనుమతి ఉండదు.”
“అసురక్షితమైన పీజీలలో ఎవరినీ నివసించడానికి మేము అనుమతించము. భవనం నుండి ఖాళీ చేయించిన వారి కోసం మేము కళాశాల హాస్టళ్లలో వసతి ఏర్పాటు చేశాము. వారి అవసరాలు తీరేలా ప్రభుత్వం చూసుకుంటోంది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితమైన విద్యార్థుల తల్లిదండ్రులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాము. వారి బాధను తగ్గించడానికి వారికి పూర్తి మద్దతును అందిస్తున్నాము. ఈ పరిస్థితికి కారణమైన ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణా లోపం, నిర్లక్ష్యం లేదా ఇతర వైఫల్యాలపై ఈరోజే కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరినీ వదిలిపెట్టరు” అని ఆమె స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నగరం అంతటా అనుమతి లేని నిర్మాణాలు, అక్రమ ఐదు అంతస్తుల భవనాలను సీల్ చేయడానికి ఒక భారీ డ్రైవ్ను ప్రారంభించింది.

More Stories
ఢిల్లీలో భవనం కూలడంపై ఎబివిపి నిరసన.. ఎంసిడి కార్యాలయంపై దాడి
ఇస్రో పాత్రను ప్రైవేట్ రంగం తగ్గించదు.. విస్తరిస్తున్న పర్యావరణం
ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం.. ఆరుగురు మృతి