ఢిల్లీలో భవనం కూలడంపై ఎబివిపి నిరసన.. ఎంసిడి కార్యాలయంపై దాడి 

ఢిల్లీలో భవనం కూలడంపై ఎబివిపి నిరసన.. ఎంసిడి కార్యాలయంపై దాడి 
రాజధానిలో సత్య నికేతన్ వద్ద భవనం కూలిపోయిన ఘటనకు సంబంధించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యుఐ) సోమవారం నిరసనలు చేపట్టాయి. ఎబివిపి నిరసనకారులు ఆదివారం సివిక్ సెంటర్‌లోకి ప్రవేశించి, ప్రధాన భవనం బయట కూర్చుని  ఎంసిడి పనితీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. 
 
ఎంసిడి  కమిషనర్ సంజీవ్ ఖి చేసినట్లు సమాచారంర్వార్ రాజీనామా చేయాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేశారు. కొందరు నిరసనకారులు బలవంతంగా ప్రధాన సివిక్ సెంటర్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో పోలీసులతో ఘర్షణ జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించామని, అక్కడ ఢిల్లీ పోలీస్ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. 
 
తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, మిగిలిన నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. ఒక ప్రకటనలో ఎబివిపి ఇలా పేర్కొంది: “అశ్రద్ధకు కారణమైన వారిని ఏ పరిస్థితుల్లోనూ వదలకూడదు. దీనిపై నిష్పాక్షికమైన విచారణ జరగాలి, దోషులను బాధ్యులను చేయాలి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.” 
 
అంతేకాకుండా,  ఎబివిపి  జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ ప్రేరణ భరద్వాజ్ మాట్లాడుతూ, తమ సంస్థ ఆదివారం నుండే ఘటనా స్థలంలో ఉందని మరియు బాధితులైన విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలుపుతోందని చెప్పారు. తాము  ఎంసిడి కార్యాలయం వద్ద కూడా నిరసన చేపట్టామని,  ఎంసిడి  కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని ఆమె తెలిపారు. 
 
“మేము నిన్నటి నుంచే ఇక్కడ ఉన్నాము. సత్య నికేతన్‌లో భవనం కూలిపోవడంతో విద్యార్థులు మరణించారు. ఇంకా చాలా మంది విద్యార్థులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. మేము వారికి మద్దతుగా ఇక్కడ కూర్చున్నాము. నిన్న  ఎంసిడి  కార్యాలయం వద్ద కూడా నిరసన తెలిపాము. కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేశాము” అని ఆమె చెప్పారు. 
 
“మేమందరం ఇక్కడ కూర్చుని జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నాము. క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతకు సంబంధించి అసలు ప్రమాణాలు ఏమిటి? అనేది మా ప్రశ్న. చివరి విద్యార్థిని రక్షించే వరకు మేము ఇక్కడి నుండి కదలము,” అని భరద్వాజ్ స్పష్టం చేశారు.  కాగా, రక్షణ చర్యలలో పెద్ద వైఫల్యం జరిగిందని ఎన్ఎస్ యుఐ అఅధికారులధ్యక్షుడు వినోద్ జాఖర్ ఆరోపించారు. ఈ ఘటనను ఎదుర్కోవడంలో అధికారుల సన్నద్ధతను ప్రశ్నించారు. విపత్తు ప్రణాళిక, నిర్వహణ, పరికరాలు, సరైన రక్షణ బృందం లేకపోవడం వల్ల వ్యవస్థ విఫలమైందని ఆయన ఆరోపించారు. 
 
ప్రైవేట్ పీజీ వసతి గృహాలను కూల్చివేసి, వాటి స్థానంలో కొత్త ప్రభుత్వ హాస్టళ్లను నిర్మించాలని జాఖర్ డిమాండ్ చేశారు. “ఈ ప్రైవేట్ పీజీలన్నింటినీ కూల్చివేసి, వాటి స్థానంలో కొత్త ప్రభుత్వ హాస్టళ్లను నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే, తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ప్రాణాలతో బయటపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము,” అని ఆయన పేర్కొన్నారు.