* నేపాల్, చైనాల మధ్య నిందారోపణల పర్వం
బుధవారం దేశంలోని మధ్య ప్రాంతంలోని మూడు జిల్లాలను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల కారణంగా వంతెనలను కొట్టుకుపోయాయి, విద్యుత్ ప్రాజెక్టులను, దారిలో వచ్చిన ప్రతీదాన్నీ ధ్వంసం చేశాయి. ఇటీవలి సంవత్సరాలలో దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటిగా పరిగణిస్తున్న ఈ వినాశకరమైన ఆకస్మిక వరదలకు కారణమేమిటనే దానిపై ఇప్పుడు నేపాల్, చైనాల మధ్య నిందారోపణల పర్వం చెలరేగింది.
‘భూగర్భ విపత్తు ఆనకట్ట’ కూలిపోవడమే ఈ విషాదానికి కారణమని పలువురు నేపాలీ పాత్రికేయులు ఆరోపించారు. చైనా నేపాల్కు ముందస్తు హెచ్చరిక జారీ చేసి ఉంటే ఈ విషాదాన్ని నివారించగలిగేదని కొందరు ఆరోపించారు. హిమానీనద సరస్సు విస్ఫోటన వరద విషయంలో సరిహద్దు ప్రాంతాలలో చైనాకు “బలమైన పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు” ఉన్నాయని వారు పేర్కొన్నారు.
“నేపాల్ మన పొరుగు దేశాల న్యాయబద్ధమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరిస్తూ వస్తుంది. అయినప్పటికీ, మన ఉత్తర పొరుగు దేశం మనల్ని తీవ్రంగా బలహీనపరిచిందని విచారంతో చెప్పక తప్పదు. ఇంతటి భారీ విపత్తు గురించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో విఫలమవడం వల్ల, మనం అపారమైన ప్రాణనష్టాన్ని చవిచూశాం,” అని నేపాల్కు చెందిన ‘నయా పత్రిక‘ జర్నలిస్ట్ పర్షురామ్ కఫ్లే ‘ఎక్స్’ ఛానెల్లో ఆందోళన వ్యక్తం చేశారు.
“వారి భూభాగం నుండి పుట్టుకొస్తున్న సంక్షోభాలను మనం నిరంతరం ఎదుర్కొంటున్నాం. అదే సమయంలో అవసరమైనా, అనవసరమైనా వారి అన్ని ఆందోళనలను పరిష్కరిస్తూనే ఉన్నాం. ఈ ఏకపక్ష ప్రేమకు నేపాల్ ఒక్కటే ఎందుకు మూల్యం చెల్లించాలి?” అని ఆయన మరో పోస్ట్లో పేర్కొన్నారు. అయితే, చైనా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ వాదనలను ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేసింది.
ఆరోపణలు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, ప్రాణాలను కాపాడటానికి సహకారం అవసరమని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికలపై ఒక ప్రకటనలో తెలిపింది.
“ఆగస్టు 26వ తేదీ ఉదయం నేపాల్ వైపున భూకంపం లేదా భూకంపం లాంటి హిమానీనదం కూలిపోవడం సంభవించింది. ఇది భారీ కొండచరియలు విరిగిపడటానికి కారణమైంది. దీనివల్ల గిరాంగ్-రసువాగఢి సరిహద్దు ప్రాంతంలోని నేపాల్, చైనా రెండు వైపులా గణనీయమైన ప్రాణనష్టం జరగగా, ప్రజలు గల్లంతయ్యారు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఆకస్మిక వరదలకు భూకంపమే కారణమని నిపుణులు, విశ్లేషకులు అంతకుముందు సూచించారు. అయితే, ఈ విషాదం ‘హిమానీనదం కూలిపోవడం’, ‘శిథిలాల ప్రవాహం’ వల్ల సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. నేపాల్-చైనా సరిహద్దు సమీపంలో నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని కూడా అది తెలిపింది.
“ఈ సంఘటనను మొదట 4.4 తీవ్రత గల భూకంపంగా నివేదించారు,” అని యుఎస్ జిఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. “సమీపంలోని భూకంప కేంద్రాలు, దీర్ఘకాలిక భూకంప తరంగాలు, ఉపగ్రహ చిత్రాలపై జరిపిన అదనపు విశ్లేషణ ఆధారంగా, ఈ భూకంపం వాస్తవానికి హిమానీనదం కూలిపోవడం, శిథిలాల ప్రవాహం వల్ల సంభవించిందని, ఎలాంటి భూకంపం జరగలేదని నిర్ధారణకు వచ్చాము.”

More Stories
ఈ రోజే ఎన్నికలు జరిగితే ఎన్డీయే 326 సీట్లు!
నేపాల్ వరదల్లో 362 మంది మృతి, 290 మంది భారతీయలు గల్లంతు
అమెరికాలో భగవత్ కార్యక్రమ నిర్వాహకుల ఎక్స్ అకౌంట్ సస్పెండ్