కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మంగళవారం నాటికి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, బిజెపి, దాని మిత్రపక్షమైన జెడియు నాయకులు సంక్షేమ ఆధారిత పాలన, పటిష్టమైన పారదర్శక యంత్రాంగాలు, ప్రపంచ వేదికపై భారతదేశం పెరుగుతున్న దౌత్య ప్రభావం వంటి అంశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని కొనియాడారు.
రాబోయే కీలక ఎన్నికల పోరుల నేపథ్యంలో, అధికార కూటమి విస్తృత రాజకీయ ప్రచారానికి ఈ వార్షికోత్సవం ఒక నాంది పలికే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల అమలు నుండి మౌలిక సదుపాయాలు, విదేశాంగ విధానం వరకు వివిధ రంగాలలో ప్రభుత్వం సాధించిన “22 ప్రధాన విజయాలను” ప్రజలకు చాటిచెప్పేందుకు బిజెపి దేశవ్యాప్త ప్రచారాన్ని సిద్ధం చేస్తోంది. సమ్మిళిత పాలన సూత్రంపై పనిచేస్తూనే, పేదల జీవితాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన పథకాలపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీహార్ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ పేర్కొన్నారు.
“ప్రధానమంత్రి పదవీకాలం 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిస్సందేహంగా, ఈ కాలంలో ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ (అందరితో కలిసి, అందరి వికాసం, అందరి విశ్వాసం) అనే సూత్రాల ఆధారంగా, పేదల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారు. నేడు దేశం ముందడుగు వేస్తోంది, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు…” అని ఆయన తెలిపారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 5 నుండి జూన్ 21 మధ్య పార్టీ దేశవ్యాప్త కార్యక్రమాన్ని నిర్వహించనుందని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ సారావోగి తెలిపారు. `నేషన్ ఫస్ట్’ అనే సంకల్పంతో ప్రధానమంత్రి తన 12 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులలో ఒకరిగా ఎదిగారని కొనియాడారు.
“నేడు దేశంలోని అత్యధిక వర్గాల ప్రజల మద్దతు ఆయనకు లభిస్తుంది. ఈ 12 ఏళ్ల పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా, జూన్ 5 నుండి జూన్ 21 వరకు ఒక పక్షం రోజుల పాటు వేడుకలు జరపాలని బిజెపి నిర్ణయించింది…” అని చెప్పారు.
బిజెపి దేశవ్యాప్త ప్రచార ప్రణాళిక
పార్టీ నాయకుల ప్రకారం, ఈ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు , బీజేపీకి సీనియర్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రజలను నేరుగా కలిసే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, డిజిటల్ పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధాన కార్యక్రమాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
ప్రభుత్వ పనితీరుకు, ముఖ్యంగా పాలనా సంస్కరణలు, భారతదేశ విదేశీ సంబంధాల విషయంలో, జెడియు జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ కూడా తన మద్దతును తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీకాలంలో, పారదర్శకతకు సంబంధించిన కీలక నిర్ణయాలు అవినీతిని తగ్గించడంలో సహాయపడ్డాయి. గతంతో పోలిస్తే బాధ్యతలను గుర్తించడం మరియు తప్పులను ఎత్తిచూపడం ఇప్పుడు మరింత సులభమైంది,” అని ప్రసాద్ పెక్రోన్నారు.
మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానానికి జెడియు మద్దతు
భారతదేశ దౌత్యపరమైన స్థానాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచ వేదికపై దేశం స్థానం గత కొన్నేళ్లుగా మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు. “గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా లభించే ఆదరణ మెరుగుపడిందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఒకదానితో ఒకటి వైరుధ్యాలు కలిగిన అనేక దేశాలు కూడా, భారతదేశం వైపు సమానమైన ఆశతో చూస్తున్నాయి. చైనా, రష్యా లేదా అమెరికా… ఏ దేశంతోనైనా సరే, భారతదేశం తన విదేశీ సంబంధాలలో సమతుల్యతను పాటించడానికి బహుశా ఇదే అతిపెద్ద కారణం కావచ్చు,” అని ఆయన వివరించారు.
2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ దౌత్యం వంటి అంశాలను మోదీ ప్రభుత్వం తన రాజకీయ సందేశంలో కేంద్ర బిందువులుగా కొనసాగిస్తోంది.

More Stories
హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు
‘టైమ్స్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మంధాన!
ఒకేసారి వార్తల్లో రెబెల్ టిఎంసి ఎంపీలు విలీనమైన ఎన్సీపీఐ!