లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత కేసు నమోదు చేయాలని కోరుతూ కర్ణాటకకు చెందిన ఎస్ విఘ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టి హైకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది.
లక్నోలోని ఎంపీ/ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల కోర్టు విఘ్నేష్ పిటిషన్ను జనవరి 28న తిరస్కరించడంతో ఆ ఉత్తర్వులను అతడు హైకోర్టులో సవాలు చేశారు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూకే పౌరసత్వం కూడా ఉందనేది ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విఘ్నేష్ శిశిర్ పిటిషన్ను స్వీకరించిన సమయంలో ఈ అంశం సున్నితమైనదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంతో కోర్టు ఛాంబర్లో విచారణ జరిగింది.
రాహుల్ గాంధీపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చాలాకాలంగా దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందన్నారు. అక్కడి ఒక కంపెనీలో ఆయన డైరెక్టర్గా ఉన్నట్లు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నట్లు స్వామి చెప్పారు. ఇలా ఇండియాలో ఉంటూ, మరో దేశంలో పౌరసత్వం కలిగి ఉండటం నేరమని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై కేంద్రానికి కూడా ఆయన లేఖ రాశారు.

More Stories
పాక్ లో వరుసగా భారత్ మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాదులు హతం
‘కార్పొరేట్ జిహాద్’ కనిపిస్తే వదిలే ప్రసక్తే లేదు
ప్రతిపక్షాలు ‘మహిళల ఆగ్రహాన్ని’ ఎదుర్కొంటారు