* వందేళ్లుగా హిందూమతంపై డీఎంకే దాడులు… మద్రాస్ హైకోర్టు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు విద్వేషపూరితమైనవని, దేశంలో 80 శాతం మందిగా ఉన్న హిందువులకు వ్యతిరేకమైనవని బెంచ్ స్పష్టం చేసింది. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ మినహా మహాత్మాగాంధీ, కామరాజర్, బుద్ధుడు, రామానుజుడు, వళ్లలార్ వంటి మహాపురుషులు సనాతన ధర్మానికి వ్యతిరేకులు కారని వ్యాఖ్యానించింది.
ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ఢిల్లీకి చెందిన బిజెపి ఐటీ విభాగం జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియాపై తిరుచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ అమిత్ మాల్వియా హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు.
ఆ పిటిషన్పై విచారణ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ను ఉద్దేశించి న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి (ఉదయనిధి స్టాలిన్) బయట తిరుగుతున్నారు. ఆయనపై మిగతా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయిగానీ, తమిళనాడులో కేసు పెట్టలేదు. కానీ, ఆ వ్యక్తి వ్యాఖ్యలను వ్యతిరేకించారంటూ, పిటిషనర్పై మాత్రం కేసు పెట్టారు. ఈ పరిస్థితి బాధిస్తోంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
పోలీసులు నమోదు చేసిన కేసును రద్దుచేశారు. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించిన పదాలు వాస్తవానికి జాతి విధ్వంసాన్ని సూచిస్తున్నాయని, ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
‘‘‘నాశనం’ (తమిళంలో ఒళిప్పు) అనే పదం ప్రాతిపదికగా ఈ కేసు దాఖలైంది. నాశనం అంటే ఉన్నదానిని లేకుండా చేయడమే. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల సమూహం ఉండకూడదనుకుంటే.. అది ‘జాతి నిర్మూలన’ కిందకు వస్తుంది. అందువల్ల ఉదయనిధి ప్రసంగాన్ని ఖండిస్తూ సోషల్ మీడియలో పోస్ట్ పెట్టినదానిని ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించలేం.’’ అని న్యాయమూర్తి తెలిపారు.
తమిళనాట హిందువులపై గతంలో ఎన్నో దాడులు జరిగాయనేందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ గత వందేళ్లుగా ఉన్న డీఎంకే ఆధ్వర్యంలో హిందూమతంపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. కాగా, తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు.
“గత 100 సంవత్సరాలుగా ద్రవిడ కజగం, ఆ తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) హిందూ మతంపై స్పష్టమైన దాడి చేస్తున్నాయని స్పష్టమవుతోంది. ఈ పార్టీకే సదరు మంత్రి కూడా చెందినవారు. మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, పిటిషనర్ మంత్రి ప్రసంగంలోని నిగూఢ అర్థాన్ని ప్రశ్నించినట్లు కనిపిస్తోంది,” అని హైకోర్టు వ్యాఖ్యానించింది.
జస్టిస్ ఎస్. శ్రీమతి మాట్లాడుతూ, ఉదయనిధి చెప్పిన మాటలు “విద్వేషపూరిత ప్రసంగం” కిందకు వస్తాయని పేర్కొన్నారు. “ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి, మంత్రి చేసిన ప్రసంగాన్ని చూడాలి, అందులో ఆయన ‘సనాతన ధర్మాన్ని ప్రతిఘటించకూడదు లేదా వ్యతిరేకించకూడదు, కానీ దానిని నిర్మూలించాలి/తుడిచిపెట్టాలి’ అని అన్నారు. తమిళంలో దానిని సనాతన ఎదిర్ప్పు (సనాతనాన్ని వ్యతిరేకించడం) అని కాకుండా, సనాతన ఒళిప్పు (సనాతనాన్ని నిర్మూలించడం) అని పేర్కొన్నారు,” అని న్యాయమూర్తి అన్నారు.
ఉదయనిధి స్టాలిన్ ఉపయోగించిన పదాలు వాస్తవానికి జాతి విధ్వంసాన్ని సూచిస్తున్నాయని, ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని మద్రాస్ హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. “సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల సమూహం ఉండకూడదనుకుంటే, తగిన పదం ‘జాతి విధ్వంసం’. సనాతన ధర్మాన్ని ఒక మతంగా పరిగణిస్తే, అది ‘మత విధ్వంసం’ అవుతుంది. ఇది ఏదైనా పద్ధతి ద్వారా లేదా పర్యావరణ విధ్వంసం, వాస్తవ విధ్వంసం, సంస్కృతి విధ్వంసం (సాంస్కృతిక జాతి విధ్వంసం) వంటి వివిధ పద్ధతుల ద్వారా ప్రజలను నిర్మూలించడాన్ని కూడా సూచిస్తుంది. అందువల్ల, సనాతన ఒజిప్పు అనే తమిళ పదబంధం స్పష్టంగా జాతి విధ్వంసం లేదా సంస్కృతి విధ్వంసం అని అర్థం. అటువంటి పరిస్థితులలో, మంత్రి ప్రసంగాన్ని ప్రశ్నించిన పిటిషనర్ పోస్ట్ ద్వేషపూరిత ప్రసంగం కాదు” అని కోర్టు పేర్కొంది.

More Stories
తమపై భారీగా పన్నులు వేయమని సంపన్నుల విజ్ఞప్తి
మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే సింగరేణి వివాదం
ముంబై మేయర్ ఎన్నికలో కీలకంగా`రిజర్వేషన్’ పక్రియ