ఇటీవల మారేడుమల్లి అడవులలో జరిగి రెండు ఎన్కౌంటర్ లలో కీలక మావోయిస్టు నేత హిడ్మా, హైటెక్ శంకర్ లతో పాటు 13 మంది మావోయిస్టులను చంపివేయడంతో పాటు మరో 50 మంది లొంగిపోవడంతో ఉత్సాహంతో ఉన్న ఏపీ పోలీసులకు ఈ సందర్భంగా పరిపాలనా కేంద్రంగా సాగుతున్న విజయవాడను మావోయిస్టులు షెల్టర్ జోన్గా చేసుకున్నట్లు బయటపడటం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది.
పెద్ద సంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎవరి దృష్టీ ఉండదని ఆటోనగర్లో 27 మంది ఒకే భవనంలో ఆయుధాలతో ఉన్నారు. విజయవాడలోని ఆటోనగర్, కానూరులోని కొత్త ఆటోనగర్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్నాయి. ఇక్కడ కర్మాగారాల్లో ఉత్తరాది నుంచి వేలాదిమంది కార్మికులు వచ్చి పొట్టకూటి కోసం పనిచేస్తుంటారు.
ప్రధానంగా ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా లేకపోవడం, గస్తీ కూడా లోపించడంతో అరాచక శక్తులకు మరింత ఊతమిస్తోంది. విజయవాడ ఆటోనగర్ విస్తరణలో భాగంగా 32 ఎకరాలలో కానూరులో కొత్త ఆటోనగర్ ఏర్పాటైంది. ఇందులో 150 పరిశ్రమలతో పాటు 350 వరకూ సర్వీస్ యూనిట్లు వచ్చాయి. వీటిలో పనిచేసేందుకు బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, యూపీల తదితర రాష్ట్రాల నుంచి కార్మికులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.
రాత్రయిందంటే ఇక్కడ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు హల్చల్ చేస్తుంటాయి. కానీ రాత్రి సమయాల్లో మాత్రం పోలీసుల గస్తీ నామమాత్రంగానే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మావోయిస్టుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) కార్యాలయానికి సమీపంలోనే మావోయిస్టులు షెల్టర్ పొందిన భవనం ఉంది. ఎస్ఐబీకి చెందిన సిబ్బంది నిత్యం మావోయిస్టుల కదలికలపై సమాచారాన్ని సేకరిస్తుంటారు. వారి సానుభూతిపరులపై కూడా నిత్యం నిఘా పెడుతుంటారు.
అయితే ఈ కార్యాలయానికి 3.5 కిలోమీటర్ల దూరంలోనే మావోయిస్టులు షెల్టర్ తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇదే మార్గంలో మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. సమీపంలోనే బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి నివాసం ఉంది. మచిలీపట్నంలోని ఎస్పీ బంగ్లాలో మరమ్మతులు జరుగుతుండటంతో ఈ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అతని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు.
ఇటీవల మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో అల్లూరి జిల్లా రంపచోడవరంలో డీజీపీ హరీష్కుమార్గుప్తా మారేడుమిల్లి ఎన్కౌంటర్లలో పోలీస్ బలగాలు విజయం సాధించాయని కొనియాడారు.

More Stories
రేణిగుంట, మదనపల్లెలలో వాజ్పేయీ కాంస్య విగ్రహాలు
ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
దేశ గౌరవాన్ని నిలిపిన నేత వాజపేయి