పాక్ నకిలీ వార్తలను ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్

పాక్ నకిలీ వార్తలను ఎండగట్టిన పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్
ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం, పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారతీయ సైన్యం కూల్చివేయడంతో పాకిస్తాన్ నకిలీ వార్తల ప్రసారానికి తెరలేపింది. భారత పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచార యుద్ధం ప్రారంభించింది. నకిలీ, పాత వీడియోలతో దుష్ప్రచారం చేస్తోంది.  ఈ నేపథ్యంలో శత్రు దేశం పాక్ చేసిన దుష్ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్ ఎండగట్టింది. 16 ఆధారాలతో పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది.

గుజరాత్​లోని పోర్టు సహా, జలంధర్​లో డ్రోన్‌, క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్‌ మీడియాలో పాక్‌ అనుకూల వ్యక్తులు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.  అయితే వీటిని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ తిప్పికొట్టింది. ఈ వీడియోలన్నీ అవాస్తవేమనని తేల్చింది. “గుజరాత్‌ లోని హజీరా పోర్ట్‌ పై దాడి జరిగిందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఫేక్. ఆ వీడియో 2021 నాటి ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించినది.

ఇక, జలంధర్‌లో డ్రోన్‌ దాడి అంటూ వస్తోన్న దృశ్యాలు, ఓ అగ్ని ప్రమాదం జరిగినప్పటివి” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. అమృత్ సర్​లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులు జరిపిందని ఓ వీడియోను సోషల్ మీడియాల పాక్ అనుకూల యూజర్లు వైరల్ చేశారు. ఇది కూడా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. కుట్రపూరితంగా క్రియేట్‌ చేసిన వీడియో అని స్పష్టం చేసింది. 

మరోవైపు, పాక్​లోని గుజ్రాన్‌ వాలాలో భారత్ ప్రయోగించిన యూఏవీ డ్రోన్​ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చేందని వైరల్ అవుతున్న వీడియో కూడా నకిలీదేనని వెల్లడైంది.  ఆపరేషన్ సిందూర్​లో పాల్గొన్న విమానం కుప్పకూలిందని పాకిస్తాన్ వైరల్ చేస్తున్న వీడియో కూడా ఫేకేనని పీఐసీ ఫ్యాక్ట్ చెక్​లో తేలింది. అది 2019లో జమ్ముకశ్మీర్ లో భారత వైమానిక దళానికి చెందిన ఎంఐ17 వీ5 హెలికాప్టర్ కూలిన వీడియో అని స్పష్టం చేసింది. 

అలాగే జమ్ముకశ్మీర్​లో ఉన్న బటల్ సెక్టార్​లోని ఆర్మీ పోస్టులపై పాక్ సైన్యం దాడులు జరపడంతో 12 మంది ఇండియన్ సైనికులు మరణించారని ఓ వీడియోను వైరల్ చేశారు. ఆ వీడియో 2011నాటిదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడైంది. అది ఫేక్ అని తేల్చేసింది. 

“పాక్​లోని నీలం-జీలం జల విద్యుత్ ప్రాజెక్టును భారత్ లక్ష్యంగా చేసుకుందని తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాగే ఆర్మీ చీఫ్ పేరిట ఓ లెటర్ ను వైరల్ చేసింది. అందులో ఆర్మీ ఛీప్ పేరే తప్పుగా ఉంది. అది కూడా నకిలీదే. భారత్ పై పాకిస్థాన్ క్షిపణి దాడి చేసిందని ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది 2020లో లెబనాన్‌ లోని బీరూట్‌ లో జరిగిన పేలుడుకు సంబంధించినది” అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.

కాగా, జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఆర్మీ బ్రిగేడ్‌పై సూసైడ్ దాడి జ‌రిగినట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్పష్టం చేసింది. పంజాబ్‌లోని జ‌లంధ‌ర్‌పై డ్రోన్ అటాక్ జ‌రిగిన‌ట్లు కూడా వ‌స్తున్న వార్త‌ల‌ను ఫేక్ న్యూస్‌గా కేంద్రం ప్ర‌క‌టించింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దీనిపై వివ‌ర‌ణ ఇచ్చింది.  ఆర్మీ కంటోన్మెంట్‌పై ఫిదాయిన్ లేదా సూసైడ్ దాడి జ‌ర‌గ‌లేద‌ని పీఐబీ వెల్ల‌డించింది. జ‌లంధ‌ర్‌లో డ్రోన్ దాడి కేవ‌లం వ్య‌వ‌సాయ క్షేత్రంలోని మంట‌లు మాత్ర‌మే అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. జ‌లంధ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎటువంటి డ్రోన్ దాడి జ‌ర‌గ‌లేద‌ని చెప్పిన‌ట్లు పీఐబీ పేర్కొన్న‌ది.

మే 8వ తేదీ రాత్రి ప‌ది గంట‌ల నుంచి మే 9వ తేదీ ఉద‌యం 6.30 నిమిషాల వ‌ర‌కు మొత్తం ఏడు వీడియోల‌ను ప‌రిశీలించామ‌ని, ఫ్యాక్ట్ చెక్ చేసిన వీడియోలు, వాటి లింక్‌ల‌ను సేక‌రించిన‌ట్లు పీఐబీ తెలిపింది. భారత్ పై మిస్సైల్ దాడి జ‌రిగినట్లు ప్ర‌చారం అవుతున్న ఓ పురాత‌న వీడియోపై కూడా పీఐబీ స్పష్టత ఇచ్చింది. వాస్త‌వానికి ఆ మిస్సైల్ దాడి 2020లో లెబ‌నాన్‌లోని బీర‌ట్‌లో జ‌రిగిన పేలుడు ఘ‌ట‌న అని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. 

ఇండియ‌న్ ఆర్మీ పోస్టును పాకిస్థానీ ద‌ళాలు ధ్వంసం చేసిన‌ట్లు ప్ర‌చారం అవుతున్న మ‌రో వీడియో కూడా ఫేక్ అని ప్ర‌భుత్వం తేల్చింది. భార‌తీయ సైన్యంలో 20 రాజ్ బెటాలియ‌న్ అనే యూనిట్ లేద‌ని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్న‌ది. కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా, పాకిస్థాన్‌లోని ప్ర‌ధాన మీడియా కూడా..భార‌త ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు పీఐబీ త‌న స్టేట్మెంట్‌లో పేర్కొన్న‌ది.