
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-18)ను బీసీసీఐ వారం రోజులపాటు వాయిదా వేసింది. వారం తర్వాత తదుపరి వివరాలు ప్రకటిస్తామని తెలిపింది. అప్పటి పరిస్థితిని పరీక్షించి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ధర్మశాలలో గురువారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో పాటు జమ్మూ కశ్మీర్, పఠాన్కోఠ్లో పాకిస్తాన్ డ్రోన్, వైమానిక దాడుల నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది.
ఆ తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రేక్షకులు, ఆటగాళ్లను మైదానం బయటకు తీసుకువచ్చింది. సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్లో గురువారం నాటికి 58 మ్యాచులు జరిగాయి. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ – బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫైనల్తో సహా మొత్తం 74 మ్యాచులు జరుగాల్సి ఉంది.
ప్రస్తుతం టోర్నీ చివరి దశలో ఉన్నది. ఫైనల్తో సహా మొత్తం 16 మ్యాచ్లు జరగాల్సి ఉండగా, ఫైనల్ ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్కతాలో జరగాల్సింది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో ఇంకా 12 లీగ్ మ్యాచులు మిగిలి ఉన్నాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ను క్రికెటర్లు ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్కతా వేదికగా ఐపీఎల్ ఫైనల్ జరగాల్సి ఉంది.
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం, ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో గుజరాత్ జెయింట్స్ (16), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (16), పంజాబ్ కింగ్స్ (15), ముంబయి ఇండియన్స్ (14) జట్లు వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా బీసీసీఐ లీగ్ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
More Stories
మరో పాక్ దౌత్యాధికారిపై భారత్ వేటు
5 ఏళ్ల తర్వాత 720 మందితో కైలాస మానస సరోవర యాత్ర
భారత్ లో 257 యాక్టివ్ కరోనా కేసులు