పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం

* మందుగుండు సామగ్రి, ఉగ్రవాద హార్డ్‌వేర్‌లు స్వాధీనం

పెహల్‌గామ్‌ ఉగ్రదాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఆ దాడి తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రకుట్ర జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.

 
పంజాబ్ లోని షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాలో అటవీ ప్రాంతం సమీపంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశాయి. భారీగా మందుగుండు సామగ్రి, ఉగ్రవాద వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ హార్డ్‌వేర్‌ ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ప్రాంతంలో స్లీపర్‌ సెల్‌లను పునరుద్ధరించడానికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ మద్దతుగల క్రాస్‌-బోర్డర్‌ టెర్రర్‌ నెట్‌వర్క్‌ల ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పంజాబ్‌ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్‌ సెల్‌, కేంద్ర సంస్థల సమన్వయంతో రెండు రాకెట్‌-ప్రొపెల్డ్ గ్రనేడ్‌లు (ఆర్‌పీజీలు), రెండు ఇంప్రూవైజ్జ్ పేలుడు పరికరాలు (ఐఈడీలు), ఐదు పి-86 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్‌ పోలీసులు తెలిపారు. 
 
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.