
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడంతో మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి.
మే 7వ తేదీ నుంచి కార్మికలు సమ్మెకు వెళ్లబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న ప్రకటించారు. మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్దమయ్యామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి సూచించారు.
మంగళవారం నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆర్టీసీ కార్మిక జేఏసీ విడుదల చేసింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న మాట్లాడుతూ సమ్మెకు ముందు అంటే, మే 5వ తేదీన ఆర్టీసి కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తామని చెప్పారు. ఆర్టీసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసి యూనిఫారంలో కార్మికులంతా ఈ కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!