
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేసి అందులో 20 శాతం ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున చిన్నతరహా ఫ్లాట్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనున్నట్టు, వీటిలో స్వయం సహాయక సంఘాలు చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సాహిస్తామని చెప్పారు.
అయితే వీటి కోసం భూసేకరణకుగానీ, నిర్మాణాలకుగానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. దీంతో నిధుల కొరత కారణంగా మిగిలిన హామీల మాదిరిగానే ఎంఎస్ఎంఈ పాలసీ కూడా తయారవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త పాలసీలో టీ-ఐడియా పథకం కింద తయారీ సంస్థలకు ఇస్తున్న క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచి, గరిష్ఠ రాయితీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు సవరిస్తున్నారు. అలాగే టీ-ప్రైడ్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న రాయితీలు 35 శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ గరిష్ఠ రాయితీ పరిమితిని రూ.75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచనున్నట్టు చెప్తున్నారు.
ఇక మహిళా యాజమాన్యంలో నడిచే ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న 10 శాతం అదనపు రాయితీని 20 శాతంగా నిర్ణయిస్తూ గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు వృద్ధి చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ అసలు మార్గదర్శకాలే లేకపోవడంతో ఈ కొత్త పాలసీ అమలుకు నోచుకోలేక పోతున్నది.
More Stories
తెలంగాణ రాజ్భవన్లో మార్ఫింగ్ రచ్చ
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు
ఆందాల పోటీలకు రూ.300 కోట్లు, పుష్కరాలకు రూ.35 కోట్లా!