
రంజాన్ మాసం సందర్భంగా భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు చేరువయ్యేందుకు ”సౌగత్-ఏ-మోదీ” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద 32 లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ ప్రత్యేక కిట్లు అందజేయనుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సౌత్ ఈస్ట్ డిల్లీలోని నిజాముద్దీన్ నుంచి మంగళవారంనాడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రత్యేక కిట్లో ముస్లిం మహిళలు, పురుషులకు దుస్తులతో పాటు, సేమియా, డ్రైఫ్రూట్స్, ఖర్జూరం, చక్కెర వంటి ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఒక్కో కిట్ ధర రూ.500 నుంచి రూ. 600 వరకూ ఉంటుంది.
బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ‘సౌగత్-ఏ-మోదీ’ ముస్లింల సంక్షేమానికి చేపట్టమని విశిష్ట కార్యక్రమమని, పేద ముస్లిం కుటుంబాలకు ఈద్ను ఆనందంగా జరుపుకునేందుకు వీలుకల్పిస్తుందని చెప్పారు. దేశంలోని 32వేల మసీదుల సహకారంతో మైనార్టీ మోర్చాకు చెందిన 32 వేల మంది కార్యకర్తలు వీటిని పంపిణీ చేస్తారని తెలిపారు.
ప్రతి మసీదు పరిధిలో 100 మంది నిరుపేద ముస్లింలను గుర్తించి ఈ గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయనున్నారు. మసీదు కమిటీ సహాయంతోనే లబ్ధిదారులను గుర్తించనున్నారు. మొట్టమొదటగా ముంబయిలోని పార్టీ మైనార్టీ మోర్చా చొరవ తీసుకొని నవీ ముంబయిలో 200 మంది పేదలను గుర్తించి ఈ సౌగత్ కిట్లను అందజేసింది. అది జాతీయ కార్యక్రమంగా రూపుదిద్దుకొంది. రంజాన్తో పాటు గుడ్ఫ్రైడే, ఈస్టర్, నౌరోజ్, నూతన సంవత్సర దినోత్సవాలు, ఇతర పర్వదినాల్లో అందజేస్తామని సిద్దికీ తెలిపారు.
140 కోట్ల మంది భారతీయులకు తాను సంరక్షకుడనని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిసారి చెబుతుంటారని, అందుకు అనుగుణంగానే ఆయన అన్ని పండుగల్లోనూ పాల్గొంటూ ఉంటారని చెప్పారు. క్రిస్టమస్, ఈస్టర్ వంటి పండుగల్లో పాల్గొనడం, అజ్మీర్లోని నిజాముద్దీన్ దర్గాకు ఛాదర్ పంపుతుంటారని తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముస్లిం సమాజంలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, ఆ వర్గాలతో సంబంధాలను మరింత బలపరుచుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఎన్నికలు జరుగనున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్-ఆర్జేడీ-ఇతర పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ 110 సీట్లు గెలుచుకుంది.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం