
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఇప్పటికే పలు తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్యకు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు.
తాజాగా తిరుమల కొండపై నుంచి వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఇలాగే విమానాలు చక్కర్లు కొడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్దమంటూ పండితులు, అర్చకులు, భక్తులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా విమానాల రాకపోకలను మాత్రం నియంత్రించ లేకపోతున్నారు.
ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నా పరిస్ధితి మారేలా కనిపించడం లేదు. దీంతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయమై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం కోరుతూ లేఖ రాశారు. ఇందులో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగమశాస్త్రం, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలను కూడా దృష్టిలో ఉంచుకుని తిరుమలను `నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు.
ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కదలికలతో ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి తిరుమల ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపడటానికి నో ప్లై జోన్ ప్రకటన అత్యంత అవసరమని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు