
వీసా బాలాజీ టెంపుల్గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిని చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. మూడు రోజుల కిందట పూజా కార్యక్రమాల అనంతరం రంగరాజన్ తన నివాసానికి చేరుకున్నారు.
అయితే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కొంతమంది వ్యక్తులు పూజారి ఇంటికి వెళ్లారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించిన ఆయన మాటలు కలిపారు. అయితే వచ్చిన వారి ప్రవర్తన, మాట తీరు సరిగా లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు అర్చకుడు నిరాకరించారు. దీంతో అక్కడే ఉన్న రంగరాజన్ కుమారుడిపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అనంతరం రంగరాజన్పైనా దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
కాగా, ఘటనపై ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారితోపాటు సహకరించిన వారినీ పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వీరరాఘవరెడ్డి అనే వ్యక్తే దాడి చేసినట్లు గుర్తించారు. అనంతరం అతనితోపాటు 20 మంది అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
More Stories
హెచ్సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్