
మున్సిపాలిటీల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలాకాలంగా పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన నడుస్తున్నది. ుందగా వాటికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముంది. మరోవైపు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీలు తేల్చిచెబుతున్నారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన తర్వాతే రిజర్వేషన్లపై స్పష్టతరానుంది. ఈ లోగానే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుందా? వేచిచూస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రత్యేక అధికారుల పాలనతో పంచాయతీలలో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీల నిర్వహణ కూడా గగనంగా మారింది.
చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదని ప్రజలు రోడ్డెక్కుతున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయడం లేదంటూ రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు ఆగ్రహంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికిప్పుడే ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేక పోతున్నట్లు స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై గ్రామాలు, పట్టణాల్లో జరిగిన వివిధ సర్వేలు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు వెళ్తే భంగపాటు తప్పదని కొందరు కాంగ్రెస్ సీనియర్నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు 2026 మే 6న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సిద్దిపేట, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల గడువు ముగియనుంది.
More Stories
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం