అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం

అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
గత పాలకులు 1998 సంవత్సరంలో అరుంధతినగర్‌లో కుటుంబ నియంత్రన చేసుకున్న వారికి అప్పటి ప్రభుత్వం పట్టాలను ఇస్తే వాటిని కూల్చడం ఏమిటని మల్కాజిగిరి బీజేపీకి ఎంపీ ఈటల రాజేందర్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండి పడ్డారు. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అరుంధతినగర్‌ లో పర్యటించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు అరుంధతినగర్‌లో కూలగొట్టిన ఇళ్లను పరిశీలించారు.
 
జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో దళిత, గిరిజన, పేద బీసీ వర్గాల ప్రజలు 60, 80 గజాల స్థలాల్లో రేకుల ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, వారి ఇండ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు కష్టార్జితంతో కట్టుకున్న ఇంటికి కాంపౌండ్‌వాల్‌ నిర్మించుకోవాలన్నా, అదనంగా మరో రూమ్‌ కట్టాలన్నా రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో అందజేస్తేనే గూడు నిలుస్తుందని, లేకుంటే ఫిర్యాదుల పేరుతో బుల్డోజర్‌తో కూల్చివేతకు పాల్తున్నారని ఆోపించారు.
 
కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కూల గొట్టడమే అజేండాగా పెట్టుకుందని అరోపించారు. జవహర్‌నగర్‌ లో పేదకుటుంబాలే నివాసం ఉంటున్నాయని, ఇక్కడ కూల్చిన రేకుల షెడ్లకు రూ.50 వేలు, స్లాబ్‌లకు రూ,2 లక్షలు చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో పెద్దవాళ్లు కోట్లాది విలువైన భూములను కొల్లగొడుతుంటే పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం జవహర్‌నగర్‌ లోని పేదలపై మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని విమర్శించారు.

జవహర్‌నగర్‌లో పేదలు నిర్మించుకున్న ఇండ్ల జోలికి వస్తే… అరుంధతినగర్‌ నుంచే ప్రభుత్వంపై యుద్ధభేరి మోగిస్తానని శపథం చేశారు. పేదలు ఇండ్లు నిర్మించుకుని కరెంటు, ఇంటి నెంబర్లు తెచ్చుకుంటే హుడా అధికారులు 2500 ఎకారల స్థలం తమ సంస్థది ఉందంటూ రావడమేమిమని ఆయన ప్రశ్నించారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా రూరల్‌ అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్‌, మేడ్చల్‌ రూరల్‌ ఓబీసీ మోర్ఛా అధ్యక్షుడు మహేందర్‌యాదవ్‌, కార్పొరేటర్‌ పానుగంటి బాబు, రంగుల శంకర్‌, పార్టీ జవహర్‌నగర్‌ అధ్యక్షుడు కమల్‌, సంతోష్‌, సందీప్‌, యాదగిరి, అరుంధతినగర్‌ వాసులు పాల్గొన్నారు.