
కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, తాము మరణం నుండి తప్పించుకున్నామని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేఖ్ హసీనా తెలిపారు. అధికారం నుంచి తప్పుకున్న తర్వాత తనపై, తన సోదరి షేక్ రెహానాపై హత్యల కుట్రల వివరాలను ఆమె వెల్లడించారు. గత ఏడాది ఆగస్టు 5న ఆమె ప్రాణభయంతో దేశ విడిచి పరారై సోదరితో కలిసి ఢిల్లీకి చేరుకున్న విషయంతెలిసిందే.
ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆడియో ప్రసంగంలో తనను పదవి నుండి దింపిన తర్వాత తనను, తన సోదరిని హత్యకావించేందుకు కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. తన ప్రాణాలు కాపాడిన అల్లాకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. జకీయ ప్రత్యర్థులు తనను చంపేందుకు కుట్ర పన్నినట్లు ఆమె చెప్పింది. “రెహానా, నేను ప్రాణాలతో బయటపడ్డాము. కేవలం 20-25 నిమిషాల వ్యవధిలో, మేము మరణం నుండి తప్పించుకున్నాము” అని ఆమె పేర్కొన్నారు.
76 ఏళ్ల మాజీ ప్రధాని షేక్ హసీనాను అధికారం నుండి తొలగించారు. విద్యార్థుల నేతృత్వంలోని పోరాటంలో 600 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న నిరసనలు, ఘర్షణల మధ్య ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టడంతో గత సంవత్సరం భారతదేశానికి పారిపోయి వచ్చారు. “ఆగస్టు 21 గ్రెనేడ్ దాడి, కోటాలిపారా బాంబు ప్లాట్లు, ఇప్పుడు ఈ ఇటీవలి బెదిరింపు నుండి నేను ప్రాణాలతో బయటపడటం అల్లా సంకల్పంగా నేను భావిస్తున్నాను” అని ఆమె భావోద్వేగంతో చెప్పింది.
“లేకుంటే ఈరోజు నేను బతికే వుండేదని కాదు” అంటూ చెప్పుకొచ్చారు. బంగ్లా భాషలో ఆమె ఆడియో ఉన్నది. 2004, ఆగస్టు 21వ తేదీన హసీనాపై గ్రేనేడ్ అటాక్ జరిగింది. అప్పుడు ఆమె గాయాలతో బటయపడ్డారు. ఇంకా దేశానికి ఏదో చేయాలని అల్లా ఆశిస్తున్నారని, అందుకే తాను ప్రాణాలతో ఉన్నట్లు ఆమె తెలిపారు.
బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమె 15 ఏళ్ల పాలనలో బలవంతంగా అదృశ్యమైందని ఆరోపించినందుకు ఆమెపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ప్రాసిక్యూటర్లు ఆమె పరిపాలన 500 మందికి పైగా అపహరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం మాట్లాడుతూ, “మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు ఆమె న్యాయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అని పేర్కొన్నారు.
కాగా, ఆమెను భారత్కు అప్పగించాలని ఢాకా అధికారికంగా అభ్యర్థించింది. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందంలో స్పష్టమైన కాలక్రమం లేకపోవడంతో ఆమె విధి అనిశ్చితంగా ఉంది. ఆమెపై విచారణ జరిగేలా అంతర్తీయ ఒత్ిడి పెంచాలని ప్రభుత్వం సూచించింది.
More Stories
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు