
ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హో్్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా, అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది.
ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది. భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్లో విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.
ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్లో భాగంగా శాస్త్రవేత్తలు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్ఎల్వీ-సీ60) వాహననౌక ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను పీఎస్ఎల్వీ-సీ60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిో వాిని అసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది.
పీఎస్ఎల్వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి.. 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వాటిని డాకింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు 3 సార్లు ప్రయత్నించారు.
అయితే వివిధ కారణాల వల్ల ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ రాగా తాజాగా విజయవంతం అయింది. ఈ క్రమంలోనే ఆ రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో తదుపరి కీలక ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4 ప్రయోగాలకు ఇది తోడ్పాటును అందించనుంది.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం