
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్- ఐఎన్సీఓఐఎస్ తాజాగా కల్లక్కడల్ హెచ్చరికలు చేసింది. ఈ కల్లక్కడల్ కారణంగా కేరళ, తమిళనాడు తీరాలకు ముప్పు పొంచి ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొంది.
రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు అలల తాకిడి ఉంటుందని వెల్లడించింది. సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఐఎన్సీవోఐఎస్ స్పష్టం చేసింది. ఐఎన్సీవోఐఎస్ తాజాగా హెచ్చరికల నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ -కేఎస్డీఎంఏ అలర్ట్ అయింది. అధికారుల సూచనతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. వారంతా సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.
తీర ప్రాంత వాసులు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ిన్న పడలు, దేశవాళీ పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పడవలను ముందుగానే సురక్షిత ప్రదేశంలో ఉంచుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఐఎన్సీఓఐఎస్ ఇచ్చిన హెచ్చరికలను విరమించుకునే వరకు.. బీచ్లలో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు కేఎస్డీఎంఏ సూచనలు చేసింది. సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పునే కల్లక్కడల్ అంటారు. సముద్రం ఒక దొంగలాగా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని ఐఎన్సీవోఐఎస్ సంస్థ తెలిపింది.
ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ బలమైన గాలులు వీస్తుంటాయని వెల్లడించింది. అందుకే దీన్ని స్థానికంగా కల్లక్కడల్ అంటారు. ఈ అధికారుల కల్లక్కడల్ హెచ్చరికలతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరప్రాంత వాసులు అలర్ట్ అయ్యారు. సముద్ర తీర ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు.
More Stories
శబరిమలద్వారపాలక విగ్రహాలపై బంగారు-రాగి తాపడాలు
అహ్మదాబాద్ లో 2030 కామన్వెల్త్ గేమ్స్
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కు సుప్రీంకోర్టు అనుమతి