
మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరాశపర్చినా ఆసీస్ బౌలర్లను ఆడుకున్నాడు. ఒక సిక్స్, 9 ఫోర్లతో సెంచరీతో కదం తొక్కాడు. ఆల్రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు.
99 రన్స్ వద్ద ఫోర్ కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదుచేశాడు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీశ్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.
సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. టెస్టు మ్యాచ్లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కావడం మరింత సంతోషం కలిగిస్తున్నదని తెలిపారు.
రంజీలో ఆంధ్రా తరఫున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి, అండర్ 16లో సైతం అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందేనని చెప్పారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
మెల్బోర్న్ టెస్టులో శతకం సాధించిన నితీశ్కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. విశాఖ కుర్రాడు నితీష్కుమార్రెడ్డి ఆసీస్పై అద్భుత శతకం చేశారని కొనియాడారు. ఒత్తిడిలోనూ నితీశ్కుమార్రెడ్డి అద్భుత శతకం సాధించారని, అతని ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని చూసి గర్విస్తున్నామని పేర్కొన్నారు.
బాక్సింగ్ డే టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్లో శనివారం మూడో రోజు సెంచరీ చేసిన విశాఖ కుర్రాడు నితీష్రెడ్డిని ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్(ఏసీఏ) అభినందిస్తూ ఏసీఏ తరుఫున రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేస్తామని ఏసీఏ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ ప్రకటించారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్