
అయితే తమ ఢిల్లీ ఛలో యాత్రకు ముందే పోలీసుల అనుమతి తీసుకున్నామని, ముందుగా అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా ఢిల్లీ ఛలో ర్యాలీలో భాగంగా ఢిల్లీలోకి 101 మంది రైతులం వస్తామని అనుమతి తీసుకున్నారని, ఆ 101 మంది జాబితా ప్రకారం అనుమతి ఉన్న రైతులనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. అందరూ గుంపుగా వస్తే అనుమతించేది లేదని తెగేసి చెప్పారు.
రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు. కానీ ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువమంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలో అనేక మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిపోయింది.
హర్యానా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా 16 మంది రైతులు గాయపడ్డారని రైతు నేతలు పేర్కొన్నారు. వారిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కులీలకు పెన్షన్లు, విద్యుత్ చార్జీల పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను రైతులు కోరుతున్నారు.
దీంతోపాటు భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారానికి చర్చలు ప్రారంభించాలని రైతు నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతోపాటు అంబాల జిల్లాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. 101 మంది రైతుల బృందం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభించింది.
శంభు సరిహద్దు వద్ద రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారిగేట్లను ఇప్పటికే ఏర్పాటు చేయించారు. ఢిల్లీ వైపు నిరసనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం మొదలై, క్రమంగా టియర్ గ్యాస్ ప్రయోగించే స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతోంది.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన