గల్ఫ్ బ్యాంకుకు రూ 700 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేరళ నర్సులు

గల్ఫ్ బ్యాంకుకు రూ 700 కోట్ల రుణాలు ఎగ్గొట్టిన కేరళ నర్సులు
కేర‌ళ న‌ర్సుల‌పై భారీ కేసులు న‌మోదు అయ్యాయి. కువైట్‌కు చెందిన గ‌ల్ప్ బ్యాంక్ నుంచి కోట్ల రుణం తీసుకుని ఉడాయించారు. సుమారు 1400 మంది మ‌ల‌యాళీలు దాదాపు 700 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన‌ట్లు తెలుస్తోంది. సాల‌రీ స‌ర్టిఫికేట్ల‌ను గ్యారెంటీగా పెట్టి గ‌ల్ప్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కేర‌ళ‌లో ద‌ర్యాప్తు మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో గ‌ల్ప్ బ్యాంక్‌కు చెందిన డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కేర‌ళ‌ను సందర్శించరు. లా అండ్ ఆర్డ‌ర్ ఏడీజీపీకి ఆయ‌న ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్ప‌టికే 10 కేసులు న‌మోదు చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఆ కేసులు న‌మోదు అయ్యాయి. ఒక్కొక్క న‌ర్సు సుమారు 50 లక్ష‌ల నుంచి 2 కోట్ల వ‌ర‌కు రుణం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌ల్ఫ్ బ్యాంక్ కువైట్ షేర్‌హోల్డింగ్ కంపెనీలో మోసం జ‌రిగిన‌ట్లు గుర్తించారు. నిందితుల్లో ఎక్కువ శాతం మంది న‌ర్సులే ఉన్న‌ట్లు తేలింది. డిఫాల్ట‌ర్ల వివ‌రాల‌ను పోలీసుల‌కు బ్యాంకు వెల్ల‌డించింది. ఆ వివరాల ఆధారంగా కేసుల‌ను రిజిస్ట‌ర్ చేస్తున్నారు. మూడు నెల‌ల క్రితం బ్యాంకులో ఫ్రాడ్ జ‌రిగిన‌ట్లు గుర్తించారు. తొలుత చిన్న రుణాల‌ను తీసుకుని వాటిని స‌కాలంలో చెల్లించేవారు.

దీంతో బ్యాంకు న‌మ్మ‌కాన్ని గెలుచుకునేవారు. 2020 నుంచి 2022 మ‌ధ్య కాలంలో ఈ మోసం జ‌రిగింది. ఆ త‌ర్వాత భారీ మొత్తంలో రుణాలు తీసుకుని  విదేశాల‌కు లేదా స్వంత దేశాల‌కు వెళ్లిపోతున్న‌ట్లు బ్యాంక్ ఆరోపించింది. రుణం తీసుకున్న వారి లోక‌ల్ అడ్రెస్సులు బ్యాంక్ వ‌ద్ద ఉన్నాయి. ఆ వివ‌రాల‌ను పోలీసుల‌కు అంద‌జేశారు. చాలా ప్లాన్ ప్ర‌కారం ఫ్రాడ్ జ‌రిగిన‌ట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ కేసులో ద‌ర్యాప్తు కోసం కేర‌ళ పోలీసుల్ని ఆశ్ర‌యించారు.