
ఈ నేపథ్యంలో గల్ప్ బ్యాంక్కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ కేరళను సందర్శించరు. లా అండ్ ఆర్డర్ ఏడీజీపీకి ఆయన ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 10 కేసులు నమోదు చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో ఆ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కొక్క నర్సు సుమారు 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గల్ఫ్ బ్యాంక్ కువైట్ షేర్హోల్డింగ్ కంపెనీలో మోసం జరిగినట్లు గుర్తించారు. నిందితుల్లో ఎక్కువ శాతం మంది నర్సులే ఉన్నట్లు తేలింది. డిఫాల్టర్ల వివరాలను పోలీసులకు బ్యాంకు వెల్లడించింది. ఆ వివరాల ఆధారంగా కేసులను రిజిస్టర్ చేస్తున్నారు. మూడు నెలల క్రితం బ్యాంకులో ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. తొలుత చిన్న రుణాలను తీసుకుని వాటిని సకాలంలో చెల్లించేవారు.
దీంతో బ్యాంకు నమ్మకాన్ని గెలుచుకునేవారు. 2020 నుంచి 2022 మధ్య కాలంలో ఈ మోసం జరిగింది. ఆ తర్వాత భారీ మొత్తంలో రుణాలు తీసుకుని విదేశాలకు లేదా స్వంత దేశాలకు వెళ్లిపోతున్నట్లు బ్యాంక్ ఆరోపించింది. రుణం తీసుకున్న వారి లోకల్ అడ్రెస్సులు బ్యాంక్ వద్ద ఉన్నాయి. ఆ వివరాలను పోలీసులకు అందజేశారు. చాలా ప్లాన్ ప్రకారం ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు.. ఈ కేసులో దర్యాప్తు కోసం కేరళ పోలీసుల్ని ఆశ్రయించారు.
More Stories
జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వంకు అప్పగింత
కేజ్రీవాల్ అధికారిక నివాసం `శీష్మహల్’ పై సివిసి దర్యాప్తు
తగ్గనున్న వంట నూనెల ధరలు