
కాంగ్రెస్- జేఎమ్ఎమ్ కూటమి ఓబీసీలను ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఝార్ఖండ్లోని బొకారోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
“కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కుట్రల పట్ల జాగ్రత్త వహించండి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వారు ఎంతకైనా దిగజారవచ్చు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యతిరేకం. ఐక్యత లేని వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉంది. దేశాన్ని దోచుకుంది” అని హెచ్చరించారు.
చోటానాగ్పుర్ ప్రాంతంలో 125పైగా ఉపకులాలను ఓబీసీలుగా పరిగణిస్తున్నారని చెబుతూ వారిని ఒకరిపైకి మరోకరిని (ఉపకులాలను) ఉసిగొల్పి కాంగ్రెస్-జేఎమ్ఎమ్ వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయని ప్రధాని విమర్శించారు. అందకే ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని మోదీ స్పష్టం చేశారు.
అందుకే ఆర్టికల్ 370ని మోదీ పాతరేశారని, ఏడు దశాబ్దాలుగా అక్కడ అంబేడ్కర్ రాజ్యాంగం అమలులో లేదని, మొదటిసారి భారత రాజ్యాంగంపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారని ప్రధాని గుర్తు చేశారు. “ఇది నేను అంబేడ్కర్ ఇచ్చే నివాళి. చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు ఝార్ఖండ్లో బీజేపీ నేతృత్వంలోన ప్రభుత్వం అవసరం” అని పిలుపిచ్చారు.
More Stories
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్