
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రపంచం వణికిపోతుంటే, కొత్తగా చైనా కూడా యుద్ధ భేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నది. తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతూ, ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పతాక స్థాయికి చేరుకుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తాజాగా పిలుపునిచ్చారు.
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్కు చెందిన బ్రిగేడ్ను జీ జిన్పింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సమగ్రమైన శిక్షణ, సన్నద్ధతతో సైనిక బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. తమ పోరాట సామర్థ్యాన్ని పెంచుకోవాలి’ అని చెప్పారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ తాజాగా పేర్కొన్నది.
తైవాన్ స్వతంత్ర, సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్న చైనా, ఆ దేశం చుట్టూ పెద్ద ఎత్తున మిలటరీ డ్రిల్స్ను నిర్వహించటం సంచలనంగా మారింది. తైవాన్కు అత్యంత సమీపంలో యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్గార్డ్ నౌకలతో చైనా సైనిక విన్యాసాలు మరింత ఉధృతమయ్యాయి. తైవాన్ను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యుద్ధం చేయడానికి వెనుకాడబోమని బీజింగ్ నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది.
కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం ఏర్పడి 2049 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. అప్పటికి తైవాన్ ను తమ దేశంలో విలీనం చేసుకొనేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. సైనికులు తప్పనిసరిగా తమ యుద్ధ నైపుణ్యాన్ని, వ్యూహాలను పెంచుకోవాలని జిన్ పింగ్ చెప్పారు.
కొంత కాలంగా తైవాన్ తమ భూభాగంలో భాగమేనని చైనా వాదిస్తోంది. గత సోమవారం తైవాన్ నలు దిక్కులా యుద్ద విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డు నౌకలను మోహరించింది. కాగా, గత సోమవారం, బీజింగ్ తైవాన్ను చుట్టుముట్టడానికి ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధనౌకలు, తీర రక్షక నౌకలను మోహరించింది.
కేవలం రెండు సంవత్సరాలలో ప్రజాస్వామ్య ద్వీపం చుట్టూ తన నాలుగో రౌండ్ భారీ- స్థాయి యుద్ధ విన్యాసాలు చేపట్టింది. చైనా కమ్యూనిస్ట్ నాయకులు తైవాన్ను బీజింగ్ నియంత్రణలోకి తీసుకురావడానికి బలాన్ని ఉపయోగించడాన్ని తోసిపుచ్చలేమని స్పష్టం చేస్తున్నారు.
దేశ వ్యూహాత్మక, కీల ప్రయోజనాల పరిరక్షణకు మిలిటరీ తప్పనిసరిగా సమర్థవంతంగా పని చేయాలని జీ జిన్ పింగ్ అన్నట్లు అధికార టీవీ పేర్కొంది. చైనా, తైవాన్ మధ్య వివాదం చియాంగ్ కై-షేక్ జాతీయవాద శక్తులను మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ యోధులు అంతర్యుద్ధంలో 1949లో ఈ ద్వీపానికి పారిపోయారు. అప్పటి నుంచి చైనా, తైవాన్లు విడివిడిగా పాలనలో కొనసాగుతున్నాయి.
More Stories
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!
అమెరికాలో 41 శాతం పడిపోయిన విద్యార్థి వీసాలు
ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక రాజకీయ నేత హతం