అప్పుడే ఈ కేసులో విచారణ ప్రారంభించిన ఈడీ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు తర్వాత మౌనంగా ఉన్నప్పటికీ, తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం మంగళవారం రూ.23.54 కోట్ల మేర చర, స్ధిరాస్తుల్ని జప్తు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఏపీఎస్ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది. ఏపీలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని ఈడీ పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోందని ఇందులో తెలిపింది.
ఈడీ దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండీ ఖాన్వేల్కర్ , సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించి ప్రభుత్వ నిధుల్ని తమ షెల్ కంపెనీలలోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపింది. కాబట్టి వీరికి చెందిన స్దిరచరాస్తులు జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. అలాగే గతంలో డిజైన్ టెక్ సంస్ధకు చెందిన రూ.31.20 కోట్లను కూడా అటాచ్ చేసినట్లు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది.
More Stories
నకిలీ దర్శనం టికెట్లు అమ్ముతున్న ఐదుగురు అరెస్ట్
కుంభమేళాలో ఆకట్టుకుంటున్న శ్రీవారి నమూనా ఆలయం
తిరుమల శ్రీవారి పరకామణి బంగారం చోరీకి యత్నం