పాఠశాలలు క్షేత్ర స్థాయిలో భౌగోళికంగా, సామాజికంగా కూడా విస్తరించాలని విద్యా భారతి అఖిల భారత కార్యకారిణీ సదస్యులు జే.ఎం. కాశీపతి సూచించారు. వివిధ రాష్ట్రాలలోని జిల్లాలు, మండలాలు, మరింత కింది స్థాయికి కూడా శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలు విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కార కేంద్రాలు, అలాగే తీర ప్రాంతాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాల వల్ల సమాజంలో మంచి పరివర్తన కనిపిస్తుందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ బండ్లగూడలోని శారదా ధామంలో రెండు రోజుల పాటు విద్యా భారతి దక్షిణమధ్య క్షేత్ర సాధారణ సభ నిర్వహించారు. ఈ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలోని విద్యాభారతి పాలక మండలి, బాధ్యులు, విషయ ప్రముఖులు హాజరయ్యారు.
విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో సశక్తికరణ, విస్తరణ, వికాసం, కార్యాచరణ యోజన మీద అందరూ దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాల కేంద్రంగానే మంచి పోకడలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. విద్యాపీఠం పని కేవలం పాఠశాలల నిర్వాహణ మాత్రమే కాదని, సమాజ అవసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ.. వాటిని తీర్చడానికే వున్నాయని పేర్కొన్నారు.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్