అనర్హత వేటుతో పోటీల నుండి వినేష్ నిష్క్రమణ

అనర్హత వేటుతో పోటీల నుండి వినేష్ నిష్క్రమణ
ఒలింపిక్స్ క్రెడల నుండి అనర్హత వేటు వేసిన మరుసటి రోజు, వినేష్ ఫోగట్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని ఎక్స్ లో ఆమె ప్రకటించింది. ‘రెజ్లింగ్‌ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీక, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను, క్షమించండి’ అని పేర్కొంది. రెజ్జింగ్‌ 2001-2024 గుడ్‌బై అంటూ ట్వీట్‌ చేసింది.
 
మూడుసార్లు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత 29 ఏళ్ల వినేష్ ఫోగాట్. మూడుసార్లు ఒలింపియన్ అయిన ఫోగాట్, మహిళల 50 కేజీల బరువు విభాగంలో జపనీస్ ఛాంపియన్ సుసాకి మరియు ఉక్రెయిన్ మరియు క్యూబాకు చెందిన మరో ఇద్దరు రెజ్లర్‌లను ఓడించిన మొదటి అంతర్జాతీయ రెజ్లర్‌గా అవతరించి బంగారు పతక పోటీకి అర్హత సాధించింది.
అంతకుముందు, 50 కేజీల ఫైనల్‌లో పాల్గొనడానికి కొన్ని గంటల ముందు ప్యారిస్ ఒలింపిక్స్ నుండి హృదయ విదారకంగా అనర్హత వేటుకు గురైన  వినేష్ ఫోగట్ కేసును వాదించడానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) తలుపులు తట్టింది. తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఫోగాట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేసన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తనను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఆర్బిట్రేషన్‌ తీర్పు వెలువరించాల్సి ఉన్నది. ఈలోపే ఆమె అనూహ్యంగా వీడ్కోలు ప్రకటించింది.
 
వినేష్ ఫోగట్ అనర్హతపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ చేశారు. స్టార్ గ్రాప్లర్ గోల్డ్ మ్యాచ్‌కి తిరిగి చేర్చుకోవాలని తొలుత అడిగినా, ఆపై  ఉమ్మడిగా ఆమెకు రజతం ఇవ్వాలంటూ విజ్ఞప్తిని సవరించారు. ఈ విజ్ఞప్తిపై సిఏఎస్ గురువారం మధ్యంతర తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అందుకు అవకాశాలు లేవని చెబుతున్నారు. 
వినేష్ తోటి రెజ్లర్, భారతీయ టోక్యో ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా  పునియా రిటైర్మెంట్‌పై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “వినేష్, నువ్వు ఓడిపోలేదు, ఓడిపోయించారు. మాకు నువ్వు ఎప్పటికీ విజేతవే. నువ్వు భారతదేశపు కుమార్తెవు మాత్రమే కాదు భారతదేశానికి గర్వకారణం” అని పునియా హృదయపూర్వక పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
50 కిలోల రెజ్లింగ్ కేటగిరీ ఈవెంట్‌లో దాదాపు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెను ఫైనల్ లో పాల్గొనకుండా అనర్హత ప్రకటించారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి  ఉష కూడా ఈ పరిణామంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెజ్లర్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.
 
 “వినీష్ అనర్హత చాలా దిగ్భ్రాంతికరం. నేను ఆమెను ఒలింపిక్ విలేజ్ క్లినిక్‌లో కలుసుకున్నాను భారత ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం మరియు మొత్తం దేశం నుండి ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చాను. మేము వినేష్‌కు అన్ని వైద్య, భావోద్వేగ సహాయాన్ని అందిస్తున్నాము,” అని ఉష తెలిపారు. 
 
“వినీష్‌పై అనర్హత వేటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  యుడబ్ల్యుడబ్ల్యుకి డబ్ల్యూఎఫ్‌ఐ అప్పీల్ చేసింది. ఐఒఎ దానిని సాధ్యమైనంత పటిష్టంగా అనుసరిస్తోంది. వినేష్ వైద్య బృందం దిన్‌షా పద్రివాలా, గగన్ నారంగ్ చేసిన ప్రయత్నాల గురించి నాకు తెలుసు” అని ఆమె వివరించారు.