నేపాల్ వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం కూడా నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ ఎయిర్క్రాప్ట్ కుప్పకూలింది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంజిన్లో లోపం కారణంగా పొఖారా సిటీలో ఆగిపోయిన ఓ ఎయిర్క్రాఫ్ట్ను రిపేర్ చేసేందుకు టెక్నీషియన్స్ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్క్రాఫ్ట్లో ఇద్దరు సిబ్బంది, 17 మంది టెక్నీషియన్స్ ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే గడిచిన 12 సంవత్సరాల కాలంలో నేపాల్లో 13 విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో 2023 జనవరి 16న జరిగిన ప్రమాదం అత్యంత తీవ్రమైనది. ఆ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. గత పన్నేండేళ్లుగా సగటున ఏడాదికి ఒక ప్రమాదం చొప్పున జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో ఎందుకు నేపాల్లో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ప్రశ్నకు నిర్వహణా లోపమే కారణమనే సమాధానం వస్తోంది. నేపాల్ ఆర్థికవ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో అక్కడ ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ సక్రమంగా లేదు. సరైన మౌలిక సదుపాయాలు లేవు. సిబ్బందికి శిక్షణంగా కూడా నాణ్యంగా లేదు. అందుకే నేపాల్లో సగటున ఏడాదికి ఒక్క విమాన ప్రమాదం జరుగుతున్నదని చెప్పవచ్చు.

More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’