
అయితే ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయని, చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని చెప్పారు.
విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదని, ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు. అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయని గుర్తుచేశారు. రాజధాని హైదరాబాద్ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగిందని, భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చిందని చెప్పారు.
ప్రాంతం ఆధారంగా ఆస్తులు, వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారని, ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారని, దానితో ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయామని వివరించారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు. అయితే, విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయిందని తెలిపారు.
రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడిందని చెబుతూ అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయని గుర్తుచేశారు. విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుందని, సన్రైజ్ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసిందని చెప్పారు. సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొంటూ 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉందని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయిందని గవర్నర్ గుర్తు చేశారు. ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసిందని చెప్పారు.
చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని గవర్నర్ తెలిపారు. కరవు నివారణ చర్యలు, రియల్టైమ్ గవర్నెన్స్ చేపట్టారని, భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారని చెప్పారు. కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారని తెలిపారు.
చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైందని చెబుతూ గవర్నర్ తన ప్రసంగాన్ని ముంగించారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెనకబడిపోయిందన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో నిరసగా విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
More Stories
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?
హిండెన్బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్