
జీఎస్టీ చెల్లింపునకు సంబంధించి కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కాగితాల్లో కంపెనీలను సృష్టించి మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ఆరు నెలలుగా జరిపిన ఆడిట్, తనిఖీల్లో మొత్తం 13,853 వ్యాపార సంస్థల పేరుతో రూ.2,289 కోట్ల జీఎస్టీ ఎగవేతలు, మోసాలు జరిగినట్లుగా తేలింది.
ఇందులో రాష్ట్ర జీఎస్టీ పద్దు కింద రూ.923 కోట్లు ఉండగా, కేంద్ర జీఎస్టీ కింద రూ.919 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.447 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎగవేతదారుల నుంచి ఇప్పటి వరకు రూ.167 కోట్లు వసూలు చేసినట్లుగా వాణిజ్య పన్నులశాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. మిగిలిన సొమ్మును తక్షణమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తెలంగాణలోని పలు వ్యాపార సంస్థల్లో బిహార్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. వారికి తెలియకుండా వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించి వ్యాపారాలు చేసినట్లు, జీఎస్టీ కట్టినట్లు బోగస్ పత్రాలు సృష్టిస్తున్నారు. తదుపరి ఆ ఫేక్ పత్రాలతో జీఎస్టీ రిఫండ్ క్లెయిమ్ చేయడం కూడా చేస్తున్నారు.
ప్రధానంగా ఎవరి పేరిట జీఎస్టీఐఎన్ ఉంటే వారి చుట్టూనే కేసు తిరుగుతూ ఉంటుందన్నది వారి విశ్వాసం. ఇదే విషయాన్ని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వివరిస్తే ఇలా అక్రమాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేలా సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లను పెంచడానికి కొత్తగా ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ శాఖ కసరత్తు చేస్తోంది.
]జీఎస్టీఐఎన్ పొందేందుకు ఇప్పటివరకూ కేవలం ఆధార్తో ఆన్లైన్లో పని జరిగిపోతుండగా ఇకపై బయోమెట్రిక్ విధానం తేవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం సువిధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. అప్పుడు జీఎస్టీఐఎన్ కావాలనుకునే వారు ఈ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆధార్ను ఆన్లైన్లో తనిఖీ చేసి వేలిముద్రలను, ఐరిస్ నమోదు చేసుకొని జీఎస్టీఐఎన్ను కేటాయిస్తారు. అయితే, ఈ సువిధ కేంద్రాలు ఇంకా రాష్ట్రంలో అమల్లోకి రాలేదు.
More Stories
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి
బీసీ కులగణన కాంగ్రెస్ కుట్ర
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం