
“ప్రొటెం స్పీకర్ భర్తృహరికి సీపీపీ చైర్పర్సన్ సోనియా గాంధీ లేఖ రాశారు. లోక్సభలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమించిన విషయంపై సమాచారం ఇచ్చారు” అని మీడియా సమావేశంలో కేసీ వేణుగోపాల్ చెప్పారు. దీంతో 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు రాహుల్ గాంధీ.
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నేతగా నియమిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు నాయకులు. ఎన్సీపీ (ఎస్పీ) నేత సుప్రియా సూలే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ నాయకుడు హమునన్ బెనివాల్ సహా మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
“ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో రాహుల్ గాంధీ కీలకపాత్ర పోషించారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఎంపికవడం మాకు సంతోషంగా ఉంది” అని శివసేన (యూబీటీ) నాయకుడు ఆనంద్ దూబే చెప్పారు. రాహుల్ గాంధీ ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం లోక్సభలో రాయ్ బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. మంగళవారమే ఆయన చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కీలకమైన ప్యానెళ్లలో ఉంటారు. ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్లను ఎంపిక చేసే కమిటీల్లో ప్రధాన మంత్రితో పాటు ప్రతిపక్షనేత కూడా ఉంటారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల తర్వాత జూన్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని ఆ సమావేశంలో ఆ పార్టీ తీర్మానం చేసింది. రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర కారణంగానే పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని ప్రశంసించిది.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!