![](https://nijamtoday.com/wp-content/uploads/2024/06/Parliament1.webp)
కాగా, మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్లో భద్రతా సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్ను అమలు చేస్తున్నారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. జూన్ 9, 10 తేదీల్లో ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పేర్కొన్నారు. నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుంచి సాధారణ ప్రజలు, ప్రముఖులతో పాటు, ఇతర ముఖ్యమైన స్థావరాలకు ముప్పు కలిగించే అవకాశముందని హెచ్చరికలు జారీ చేశారు.
పారామోటార్లు, హ్యాంగ్ గ్లైడర్లతోపాటు పారాగ్లైడింగ్ చేయడం, డ్రోన్లు, గాలి బుడగలు, రిమోటెడ్ ఎయిర్క్రాఫ్ట్లను ఎగురవేయడాన్ని నిషేధించినట్లు చెప్పారు. ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరుకాబోతున్నారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్జెండర్లు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్ల వంటి కీలక ప్రాజెక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు.
More Stories
నీట్ టాప్ ర్యాంకర్లుగా మిగిలింది 17 మందే
యునెస్కో వారసత్వ సంపద జాబితాలో అహోమ్ సమాధులు
పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ దిద్దుబాటు చర్యలు