
బాలీవుడ్ నటి, మండీ నుండి లోక్ సభ కు బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన కంగనా రనౌత్కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్ ఆమెను చెంప దెబ్బ కొట్టింది. సెక్యూరిటీ చెకింగ్ సమయంలో కంగనా, మహిళా సెక్యూరిటీ ఉద్యోగి మధ్య వాగ్వాదం జరిగింది.
రైతులపై ద్వేషపూరితంగా మాట్లాడినందుకు కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ జవాన్ చెంపదెబ్బ కొట్టినట్లు తెలుస్తొంది. దీంతో వెంటనే మహిళా జవాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆ అధికారిణిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై ఆ లేడి కానిస్టేబుల్ ను ప్రశ్నించినప్పుడు పంజాబ్ లో జరిగిన రైతు ఉద్యమంపై, ముఖ్యంగా పంజాబ్ మహిళలకు వ్యతిరేకంగా తప్పుడు కూతలు కూసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కంగనా రనౌత్ విలేకరులతో మాట్లాడుతూ ‘ సెక్యూరిటీ చెకింగ్ అప్పుడు ఆమె దుర్భాషలాడింది, ముఖం మీద కొట్టింది’ అని పేర్కొంది. ఈ ఘటన ఛండీగఢ్ విమానాశ్రయంలో జరిగింది.
‘సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెక్ అప్పడు సెకండ్ క్యాబిన్ నుంచి వచ్చి నా చెంప పగుల గొట్టింది. పైగా దుర్భాషలాడింది. నేను ఎందుకిలా చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు, ఆమె తాను రైతుల నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది. నేను సురక్షితంగా ఉన్నాను. కానీ పంజాబ్ లో పెరుగుతున్న ఉగ్రవాదం, తీవ్రవాదం విషయంలో కంగారుపడుతున్నాను’’ అని కంగనా చెప్పుకొచ్చింది.
ఇదిలావుండగా ఈ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు లభించలేదని ఎయిర్ పోర్ట్ డిసిపి కుల్జిందర్ సింగ్ ఓ దినపత్రిక విలేకరికి తెలిపారు. దీనిపై హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకుర్ ప్రతిస్పందిస్తూ ‘ఇది చాలా దురదృష్టకరం. ఎవరూ మరొకరికీ హానీ కలిగించకూడదు. కంగనా రనౌత్ ఓ పార్టీ మీటింగ్ లో పాల్గొనడానికి ఢిల్లీకి వెళుతోంది. నేను కూడా సాయంత్రం ఛండీగఢ్ విమానాశ్రంయం నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వెళుతుండగా ఇది జరిగింది’’ అని తెలిపారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం