నిశాంత్ అగర్వాల్కు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధించింది. నాగ్పూర్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టెక్నికల్ విభాగంలో పనిచేసిన నిశాంత్ అగర్వాల్ను 2018 లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్.. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో భాగంగా పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశాయి.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు.. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించిన ఆ సంస్థ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఎఫ్), అధికారిక రహస్యాల చట్టంలోని పలు సెక్షన్ల కింద దోషిగా తేల్చినట్లు అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ దేశ్పాండే తీర్పులో వెల్లడించారు. నిషాంత్ అగర్వాల్.. బ్రహ్మోస్ ఫెసిలిటీలో 4 ఏళ్ల పాటు పనిచేశాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్- ఐఎస్ఐకి సున్నితమైన సాంకేతిక సమాచారాన్ని లీక్ చేసినట్లు అతనిపై ఆరోపణలు రాగా అరెస్ట్ చేశారు.
More Stories
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ప్రధాని మోదీతో టీమ్ ఇండియా క్రికెటర్ల భేటీ
ఢిల్లీలో రోహిత్ సేనకు ఘనస్వాగతం