ఓ చేతిలో ‘ప్రౌడ్ టు బి ఫస్ట్ మేల్ ఓటర్ ’ సర్టిఫికెట్, మరో చేతి వేలికి సిరా గుర్తును చూపిస్తూ కేంద్ర మంత్రి ట్విట్టర్లో ఫొటో షేర్ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర మంత్రి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 39.13 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో గరిష్టంగా 54.08 శాతం పోలింగ్ రికార్డయినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
కాగా, బీహార్లో 36.48 శాతం పోలింగ్ నమోదు కాగా, హర్యానాలో 36.48, జమ్మూకశ్మీర్లో 35.11, జార్ఖాండ్లో 42.54, ఢిల్లీలో 34.37, ఒడిశాలో 35.69, ఉత్తరప్రదేశ్లో 37.23 శాతం పోలింగ్ నమోదైంది.
కాగా, దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాలకు, బీహార్ (8), బెంగాల్ (8), హర్యానా (10), ఝార్ఖండ్ (4), ఉత్తరప్రదేశ్ (14), జమ్మూ కాశ్మీర్ లోని ఒక సీటుకు పోలింగ్ జరుగుతోంది. ఇక ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతోంది.
More Stories
ఎలాన్ మస్క్- బీజేపీ నేత మధ్య ‘ఈవీఎం’ వార్
జమ్ముకశ్మీర్లోని భద్రతా పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
మోదీతో సెల్ఫీ దిగిన ఇటలీ ప్రధాని