హాంగ్కాంగ్ నిషేధించిన ఉత్పత్తుల్లో ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, ఎండీహెచ్ సాంబార్ మసాలా మిక్స్డ్ మసాలా పౌడర్, ఎండీహెచ్ కర్రీ పౌడర్ ఉన్నాయి. మసాలాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో ఆ మసాలా ప్యాకెట్లను సేకరించి ఫుడ్ సేఫ్టీ సంస్థ వాటికి పరీక్షలు నిర్వహించింది.
ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉన్న ల్యాబ్ల్లో ఇథిలిన్ ఆక్సైడ్ పరీక్షలు చేపట్టినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. ఈ రెండు బ్రాండ్లే కాకుండా ఇతర బ్రాండ్లకు చెందిన మరో 300 శ్యాంపిళ్లను కూడా పరీక్షించినట్లు శాస్త్రీయ నిపుణులు తెలిపారు. సైంటిఫిక్ ప్యానల్ బోర్డులో .. స్పేస్ బోర్డు, సీఎస్ఎంసీఆర్ఐ (గుజరాత్), ఇండియన్ స్పైస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (కేరళ), ఎన్ఐఎఫ్టీఈఎం (హర్యానా), బీఏఆర్సీ (ముంబై), సీఎంపీఏపీ (లక్నో), డీఆర్డీవో (అస్సాం), ఐసీఏఆర్, నేషనల్ రీసర్చ్ సెంటర్ ఆన్ గ్రేప్స్ (పుణె)కు చెందిన నిపుణులు ఉన్నారు.
More Stories
ఫోన్ నంబరు కలిగి ఉన్నందుకు త్వరలో ఫీజు!
22న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం
పక్షం రోజుల్లో 30-50 శాతం పెరిగిన ఉల్లి ధరలు