
వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ వానలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా అది అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిజెపి ప్రతినిధివర్గం ప్రశ్నించింది. రేవంత్ రెడ్డిని శనివారం సచివాలయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు కలిశారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చూపాలని, పంటల కొనుగోలు దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని స్పష్టం చేశారు. రైతులకు బోనస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని వారు చెప్పారు. మూడు నుంచి నాలుగు కేజీ లు అదనంగా ధాన్యం తీసుకుంటుంన్నారని, కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
మిగిలిన రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కోరారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత