
పల్నాడు, రాయలసీమ హింసాత్మక ఘటనలపై కూటమి నేతలు రాజ్ భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. హింసాత్మక ఘటనలు నివారించడంలో పోలీసులు అసమర్ధతగా వ్యవహరించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు వెల్లడించారు. పెన్డ్రైవ్లో అన్ని వీడియో ఆధారాలను గవర్నర్కు అందజేయగా ఆ హింసాత్మక ఘటనలను చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు.
జరిగిన హింసపై సీఎస్, డీజీపీలకు ఈసీ సమన్లు జారీ చేయడం సిగ్గు చేటని నేతలు మండిపడ్డారు. ఒడిపోతున్నామని తెలిసే ఈ విధమైన హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదలకు చెల్లించాల్సిన నిధులు గుత్తేదారులకు చెల్లించే యత్నానికి కూడా అడ్డుకట్ట వేయాలని గవర్నర్ను కోరామని తెలిపారు.
తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్లు గవర్నర్ అబ్దుల్ నజీర్తో ) భేటీ అయ్యారు. ప్రజలు తనను తిరస్కరించారని జగన్కు అర్థమైందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. ఓటమి పాలవుతున్నామనే ఎన్నికల సమయంలో, తర్వాత అరాచకాలు సృష్టింస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటింగ్ సమయంలో క్యూలో ఉన్న వారిని తరిమికొట్టాలని చూశారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలు సృష్టించాలని వైసీపీ నేతలు నిర్ణయించారని చెప్పారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు