పసుపు బోర్డు వస్తే.. విత్తనాలు, భూసార పరీక్షలు మొదలు.. అన్ని అంశాలపై దృష్టి ఉంటుం దని చెప్పారు. పరిమితిలో ఎరువులు వాడితే పసుపు ఎగుమతులకు డిమాండ్ ఉంటుందని రైతులకు సూచించారు. గోదాములు, పసుపు శుద్ది కర్మా గారాలు వస్తాయని పేర్కొన్నారు. రైతులు, వినియోగదారులను కలిపే వ్యవస్థ ఏర్పాటు అవుతుందని చెబుతూ రైతుల వద్దకే కొను గోలుదారు వచ్చి పంట కొనేలా వ్యవస్థ ఏర్పాటు అవుతుందనీ ఎంపీ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క రైల్వే బ్రిడ్జి ఉండేదని, తాను వచ్చాక ఏడు తీసుకొచ్చాననీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతి కారణంగానే చక్కెర పరిశ్ర మలు తెరుచుకోవడం లేదనీ మండిపడ్డారు. నిజామాబాద్ మార్కె ట్ యార్డు తెలంగాణా లోనే పెద్దదని చెబుతూ పసుపు లావాదేవీల మీదనే యార్డు కు రూ 10-12 కోట్లు ఆదాయం వస్తుందని, ఏటా రూ. 20 కోట్ల ఆదాయం ఉంటుందని అరవింద్ వివరించారు.
కానీ ఆ నిధులు నిజామాబాద్ మార్కె ట్ యార్డులో ఖర్చు చేస్తలేరనీ తెలిపారు. కొన్నేళ్లుగా ఆ నిధులు మొత్తం సిరిసిల్ల, సిద్ధిపేటకు వెళ్లిపోయాయని ఆరోపించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఒక్క సౌలత్ ఏర్పాటు చెయ లేదన్నారు. సీఏఏ 2019 లో తెస్తే కాంగ్రెస్ లొల్లి పెట్టిందనీ గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముస్లిం లకు సైతం పౌర సత్వం ఇవ్వాలని ఆందోళన చేశాడని ధ్వజమెత్తారు. ఇప్పుడు సీఏఏ అమలు చేస్తుంటే ఎన్నికలు ఉన్నాయని హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నాడని చెప్పారు. ముస్లింలకు పౌరసత్వం ఇస్తే ప్రత్యేకంగా ముస్లిం దేశాలు ఎందుకు మరి? అని ప్రశ్నించారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదు
ఈసీ ఒప్పుకున్నా పంట పరిహారంపై స్పందించని రేవంత్