బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్

బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని బెదిరిస్తున్న కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే దేశం భగ్గుమంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ కలల సాకారానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, అవినీతిని నిర్మూలించాలని మోదీ చెబుతుంటే, అవినీతిని కాపాడంటంటూ వారు చెబుతున్నారని ప్రధాని విమర్శలు గుప్పించారు. 
 
రాజస్థాన్‌ లోని కోట్‌పుత్లిలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పోటీ చేస్తున్న తొలి ఇన్నికలు ఇవని, బీజేపీ గెలిస్తే మాత్రం దేశం తగులబడుతుందని బెదిరిస్తోందని ఎద్దేవా చేశారు.  దేశమంతా ఒకే కుటుంబ భావనతో బీజేపీతో ఉందని, కాంగ్రెస్ మాత్రం దేశం కంటే తమ కుటుంబమే పెద్దదిని భావిస్తోందని మోదీ దయ్యబట్టారు. 
 
దేశ కీర్తిని పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడు విదేశాలకు వెళ్లినా దేశ ప్రతిష్ఠను దిగజారుస్తూ వస్తోందని ప్రధాని విమర్శించారు. మోదీ పుట్టింది ఎంజాయ్ చేయడానికి కాదని, కష్టించి పనిచేయడానికి తెలిపారు. గత పదేళ్లలో ఎంతో చేశామని, అది కూడా ఒక ట్రయిలర్ మాత్రమేనని పేర్కొన్నారు.స్వాతంత్ర్యానంతరం 60 ఏళ్ల పాటు దేశం పేదరికంలో మగ్గడానికి కాంగ్రెస్ కారణమని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ కారణంగానే సాంకేతికత, రక్షణ సామాగ్రి కోసం ఇతర దేశాలపై భారత్ ఆధారపడాల్సి వచ్చిందని తెలిపారు. మన సాయుధ బలగాలను ఎన్నడూ ఆత్మనిర్భర్‌గా మార్చలేదని, కాంగ్రెస్ పాలనలో ఆయుధాల దిగుమతిలో అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ నిలిచిందని చెప్పారు. అందుకు భిన్నంగా ఇప్పుడు బీజేపీ హయాంలో ఆయుధాల ఎగుమతిదారుగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు.

ఉత్తరాఖండ్ కు చెందిన ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ నుంచి ఆయన లోక్ సభ ఎన్నికల  ప్రచారాన్ని మొదలెడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ కు ఏమీ పాలుపోవడంలేదని చెబుతూ అన్ని చోట్ల నుంచి కాంగ్రెస్ ను తుడిచివేయాలని ప్రధాని పిలుపిచ్చారు. దేశాన్ని అరాజచకం, అస్థిరత్వం వైపుకు నెట్టడమే కాంగ్రెస్ ఉద్దేశ్యమని ప్రధాని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ షెహజాదా (రాహుల్ గాంధీ) మరోసారి  ప్రభుత్వం వస్తే దేశంలో అగ్గి రాజుకుంటుందని హెచ్చరించారని చెబుతూ వారు అధికారం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో అగ్గి వగైరా మాట్లాడుతున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. వారిని ఇలాగే వదిలేస్తారా? వారిని మీరు శిక్షించరా? అని ప్రశ్నించారు. వారి పార్టీ దేశాన్ని అస్థిరం వైపుకు, అరాజకం వైపుకు నెట్టాలనుకుంటోందని విమర్శించారు.

కాగా, అవినీతికి వ్యతిరేకంగా తమ చర్యలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం  చేశారు.  ‘అవినీతిపరులు జైలుకు వెళ్లాలని మీరు కోరుకోరా? అవినీతిపరులు నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. కానీ వారు నన్ను వంచలేరు. ప్రతి అవినీతిపరుడిపై చర్య తీసుకోవడం జరుగుతుంది’ అంటూ మోదీ తేల్చి చెప్పారు.