అయితే, ప్రస్తుతం భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలో బలమైన, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థగా ఉందని కొనియాడారు. తమ ప్రభుత్వం గుర్తింపు, తీర్మానం, రీక్యాపిటలైజేషన్ వ్యూహంపై పని చేసిందని చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల మూలధనాన్ని సమకూర్చి, పాలనా సంస్కరణలను చేపట్టిందని తెలిపారు. దాదాపు రూ.3.25 లక్షల కోట్ల విలువైన రుణాలు దివాలా కోడ్ కొత్త వ్యవస్థ ద్వారా పరిష్కరించినట్లు తెలిపారు.
“ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన దేశాలలో భారతదేశం ఒకటి. మన విధానాలు ఆర్థిక వ్యవస్థలో గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎగుమతి విధానం, ఎంఎస్ఎంఇ, అంతరిక్షం, పర్యటికం వంటి కొత్త రంగాలకు తెరతీశాయి. ఆర్బిఐ యువత ఆకాంక్షలను తప్పక పరిష్కరించాలి. యువతకు సహాయం చేయడానికి ఈ అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాల కోసం ‘అవుట్-ఆఫ్-బాక్స్’ విధానాలను అభివృద్ధి చేయాలి” అని ప్రధాన మంత్రి సూచించారు.
రూ. 9 లక్షల కోట్లకు పైగా దివాళాతో కూడిన 27,000 కంటే ఎక్కువ దరఖాస్తులు పరిష్కరించామని, 11.25 శాతంగా ఉన్న బ్యాంకుల స్థూల ఎన్పిఎలు సెప్టెంబర్ 2023 నాటికి 3 శాతం కంటే తక్కువకు పడిపోయాయని ప్రధాని మోదీ తెలిపారు. జన్ ధన్ ఖాతాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్, దేశ బ్యాంకింగ్ ప్రధాన స్రవంతిలో పేదలను చేర్చుకోవడం, 1,200 కోట్లకు పైగా డిజిటల్ చెల్లింపుల వృద్ధితో సహా గత 10 సంవత్సరాలలో ఇతర ప్రధాన విజయాలను కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ప్రతి నెల లావాదేవీలు, ఇతరులతో పాటు. ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రక్షణ రంగంలో ఎగుమతులు, ఎంఎస్ఎంఇ లు భారతదేశ ఉత్పాదక రంగానికి వెన్నెముకగా మారుతున్నాయని చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఆర్బీఐ ఓ సంస్థగా వృద్ధి చెందడం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధితో దగ్గరి సంబంధం ఉందని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్గా ఉన్నందున.. ఆర్బీఐ మార్కెట్, ఆర్థిక వ్యవస్థకు ఎనేబుల్గా చేసిందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలల్లో ఇన్సాల్వెన్సీ, దివాలా కోడ్ని అమలు చేయడం, సంస్కరణలు బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవటానికి, ధరల స్థిరత్వాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడానికి తమకు సహాయపడ్డాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
నేటి ప్రపంచంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని, మారుతున్న కాలానికి అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు అవసరమైన విధానపరమైన చర్యలు తీసుకుంటోందని వివరించారు.
More Stories
వయనాడ్లో ఓటమి భయంతో రాయ్బరేలి బరిలో
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ