బ్రెజిల్లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్లోని సావో పాలోలో అరండోలో జరిగిన వేలంపాటలో ఈ జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు కోనుగోలు చేశారు. దీంతో ఈ జాతి ఆవుకు సరికొత్త రికార్డు సృష్టించింది. అంటే ఈ ఆవు రూ.40 కోట్ల రూపాయిల ధర పలికింది.
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలు జాతి ఆవులను వయాటినా 19 ఎఫ్ఐవి మారా ఇమోవిస్ అని పిలుస్తారు. ఈ అవులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది ఇప్పటి వరకు అంతర్జాతీయ పశువులు మార్కెట్లో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆవుగా చరిత్ర సృష్టించింది. ఈ జాతి ఆవులోని జన్యు లక్షణాల కారణంగా అది రికార్డు ధర పలికినట్లు తెలుస్తోంది.
నెల్లూరు జాతి ఆవు శరీరమంతా తెల్లటి వెంట్రుకలు, భుజాలపై విలక్షణమైన మూపురం కలిగి ఉంటుంది. ఇది బ్రెజిల్లోని అత్యంత పేరుగాంచిన పశువుల జాతుల్లో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పేరు కలిగిన ఈ జాతి పశువులను శాస్త్రీయంగా బోస్ ఇండికస్గా పిలుస్తారు. ఇవి ఒంగోలు జాతి పశువుల సంతతికి చెందినవి.
1868లోనే ఒంగోలు మేలు జాతి ఆవుల జంటను బ్రెజిల్కు తరలించారు. నాటి నుంచి ఈ జాతి ఆవుల వృద్ధికి ఆ దేశం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఈ జాతి ఆవులు నేటికి16 మిలియన్ల వరకు ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ దేశంలో 80 శాతం ఆవులు ఈ జాతివే కావడం గమనార్హం.
నెల్లూరు జాతి ఆవులు అత్యంత వేడి ఉష్ణోగ్రతలలో కూడా వృద్ధి చెందగల సామర్థ్యం, సమర్థవంతమైన జీవక్రియ, అంటువ్యాధులకు తట్టుకుని నిలబడతాయి. దీంతో బ్రెజల్ పశువుల పెంపకందారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
జన్యుపరమైన ప్రయోజనాలను పెంపొందించడానికి ఈ బ్రీడ్ ఆవులను ప్రత్యేకంగా ఎంపిక చేసి పెంచుతున్నారు. నెల్లూరు ఆవుల జన్యు పదార్ధం, పిండాలు, వీర్యం వంటి వాటిని సేకరించి వాటి సంతానాన్ని మరింతగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుంది. అందుకే నెల్లూరు జాతి ఆవుకు వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది.
బ్రెజిల్లోని సావో పాలోలోని అరండూలో జరిగిన వేలంలో నాలుగున్నర సంవత్సరాల వయస్సు గల ఆవు 6.99 మిలియన్ రియల్లకు విక్రయింయించారు. ఇది 1.44 మిలియన్ అమెరికా డాలర్లకు సమానం. నెల్లూరు జాతీ ఆవులకు అంతర్జాతీయ పశువుల మార్కెట్లో విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఇది ఈ జాతి విలువను నొక్కి చెబుతుంది.
తక్కువ మేతతో వృద్ధి చెందగల సామర్థ్యం, పెంపకం సౌలభ్యంతోపాటు బ్రెజిల్లోని వైవిధ్యంగా ఉండే ఎలాంటి వాతావరణంలోనైనా నిలదొక్కుకోగల సామర్థం వీటికి ఉండటంతో పశువుల పెంపకందారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు