
మరోవైపుశనివారం ఉదయం 06 గంటల తర్వాత ఏడు మందితో కూడిన ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోదాలు చేపట్టింది. ఇక్కడ ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది.కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయా? లేక మరేదైనా కోణంలో తనిఖీలు చేపట్టారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని, కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తే మళ్లీ సుప్రీంను కవిత ఆశ్రయించే అవకాశం ఉంది.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు