
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 27 చివరి తేదీ. కాగా నామినేషన్ల పరిశీలన 28వ తేదీ. నామినేషన్ల ఉపసంహకరణకు 30 చివరి తేదీ. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.
ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈసీ నోటిఫికేషన్ జారీ చేయడంతో తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకూ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు.
తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుంది.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!