ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ తొలిసారి ఈ మెట్రోలో ప్రయాణించారు. రూ.120 కోట్ల వ్యయంతో 16.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా పిలుస్తున్నారు. హుగ్లీ నది కింద నిర్మించిన ఈ మార్గం కోల్కతాలోని రెండు జంట నగరాలైన హౌరా, సాల్ట్ లేక్లను కలుపుతుంది.
ఈ మార్గంలో మొత్తం మూడు స్టేషన్లు ఉండగా అందులో మూడు భూగర్భం (జలాంతర్గ)లో ఉన్నాయి. అండర్వాటర్ మెట్రోతో పాటు కవి సుభాష్- హేమంత ముఖోపాధ్యాయ మెట్రో స్టేషన్, తరతాలా-మజేర్హట్ మెట్రో సెక్షన్ను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. ఈ విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా పాల్గొన్నారు. మెట్రో రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కౌసిక్ మిత్రా మాట్లాడుతూ కోల్కతా ప్రజలకు ఇది మన ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుక అని చెప్పారు. మెట్రో రైల్వే ప్రకారం, ఈ కారిడార్ ను నగరం మాస్టర్ ప్లాన్లో 1971లో చేర్చారు.
కోల్కతాలో భారతదేశపు మొట్టమొదటి మెట్రో అనుభవం, ఢిల్లీ మెట్రో నెట్వర్క్ యొక్క విజయం తగినంత సాంకేతిక మద్దతును అందించింది. జూలై 2008లో దీనిని మంజూరు చేయడానికి ప్లానర్లకు మార్గం చూపింది. “తూర్పు-పశ్చిమ కారిడార్ను నిర్మించే మనోహరమైన ప్రయాణం అలా మొదలైంది. ఈ లైన్ హౌరా -సీల్దా రైల్వే స్టేషన్లను కలుపుతుంది, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రెండు స్టేషన్లు, దేశంలోనే మొట్టమొదటి రివర్ క్రాసింగ్ అయిన హుగ్లీ నది కింద గుండా వెళుతుంది.” అని చెప్పారు.
హౌరా- కోల్కతా పశ్చిమ బెంగాల్లోని రెండు శతాబ్దాల నాటి చారిత్రక నగరాలని, ఈ సొరంగం హుగ్లీ నది కింద ఈ రెండు నగరాలను కలుపుతుందని ఆయన పేర్కొన్నారు. హౌరా మైదాన్ నుండి ఎస్ప్లానేడ్ వరకు రూ. 4,138 కోట్లతో నిర్మించిన తూర్పు-పశ్చిమ మెట్రో 4.8-కి.మీ పొడవు హౌరాలో భారతదేశంలోనే లోతైన మెట్రో స్టేషన్ను కలిగి ఉంటుందని భారతీయ రైల్వేలు పేర్కొంటున్నాయి.
More Stories
2029 వరకు ప్రధానిగా నరేంద్ర మోదీ
సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు
బీజేపీకి 400 సీట్లు వస్తే మధుర, కాశీలోనూ దేవాలయాలు నిర్మిస్తాం